రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వైసీపీ టీడీపీ రెండు మోసపూరిత ప్రభుత్వాలే..!

Chaitanya Kumar bjym nandyal? Bjym news ? Telugu news, general news, political news,
Peoples Motivation

వైసీపీ టీడీపీ రెండు మోసపూరిత ప్రభుత్వాలే..!

-బిజెవైమ్ మాజీ అధ్యక్షులు చైతన్య కుమార్

కర్నూలు, ఫిబ్రవరి 18 (పీపుల్స్ మోటివేషన్):-

ఉచిత హామీల పేరుతో అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను అలాగే యువతను నట్టేట ముంచాయని నంద్యాల జిల్లా బిజెవైమ్ మాజీ అధ్యక్షులు చైతన్య కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎన్నికలు దగ్గర పడుతున్న వేల రెండు పార్టీలు ఒకదానికి మించి మరొకటి సాధ్యం కాని ఉచిత హామీలతో మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సీక్వెల్ రూపంలో ఈ ప్రభుత్వాలు రానున్నాయి అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే ఈ ప్రభుత్వాలు అమలుపరిచి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాయి. కావున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా యొక్క విన్నపం ఈసారి టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బిజెపి పార్టీని బలపరిచి ఈ రెండు పార్టీల మెడలు వంచాలి. బిజెపి పార్టీ చేపడుతున్న ప్రజాపోరు-1 విజయంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రజాపోరు రెండో విడత కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రజాపోరు రాష్ట్ర కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డికి అలాగే రాయలసీమ కన్వీనర్ పోలంకి రామస్వామికి, ఇతర ముఖ్య నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Chaitanya kumar
బిజెవైమ్ మాజీ అధ్యక్షులు చైతన్య కుమార్

Comments

-Advertisement-