DMHO వ్యవహారంపై సర్వత్రా ఆగ్రహం..కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
DMHO వ్యవహారంపై సర్వత్రా ఆగ్రహం..కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
• కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
• కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు
కామారెడ్డి, మే 16 (పీపుల్స్ మోటివేషన్):-
మహిళ మెడికల్ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపుల ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో డీఎంహెద్ లక్ష్మణ్ సింగ్ పై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్సీ నాగేశ్వరరావు తెలిపారు. తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో మహిళ మెడికల్ ఆఫీసర్లు పేర్కొన్నారు. డీఎంహెచ్ ఓ లక్ష్మణ్ సింగ్ను దేవునిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తు న్నారు. కామారెడ్డి డీఎంహెచ్ ఓ లక్ష్మణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది కాలంగా తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళ మెడికల్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు, వేధింపుల ఘటనపై డీఎంహెన్రెపై ఉన్నతాధికారులు సైతం ఫైర్ అయ్యారు. లైంగిక వేధింపుల ఘటనపై డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ అడిషనల్ డైరక్టర్ అమర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ విచారణలో తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారని 10 మందికి పైగా మహిళా మెడికల్ ఆఫీసర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెడోవో లక్ష్మణ్ సింగ్, సూపరిం బెండెంట్ శ్రీనునాయక్ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ సింగ్, శ్రీనునాయక్పై తాజాగా మరికొందరు పీహెచ్సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కిండ కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. డీఎంహెల్నో లక్ష్మణ్ సింగ్, సూపరింటెం డెంట్ శ్రీనునాయక్ తనిఖీల పేరిట వస్తూ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ జిల్లాలోని పలు పీహెచ్సీలకు చెందిన 21 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు 10 రోజుల కింద వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు. చేశారు. 'పీహెచ్సీకి వచ్చినప్పుడు డీఎంహెడోవో పక్కన కూర్చొమనేవారు.. కూర్చోకపోతే పనిలో లోపాలు వెతికి వేధించేవారు. ఫోన్ చేసి మరీ సంసారం జీవితం ఎలా సాగుతుందంటూ అభ్యంతరకరంగా మాట్లాడేవారు' అంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అమర్సేంగ్ నాయక్ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇరు వర్గాలను పిలిపించి.. వారితో మాట్లాడాడు. విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అక్కడికి చేరుకోగా.. వేధింపుల విషయాన్ని పలువురు మహిళా ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా విచారణ జరుగుతోందని ఎమ్మెల్యే తప్పుబట్టారు. బాధిత మహిళా ఉద్యోగులతో పాటు మరికొందరు అధికారులూ ఇక్కడికి రావాలన్నారు. డీఎంహెచ్, సూపరింటెండెంట్ తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా వీరు ఉద్యోగాలు. నియామకాలు, డిప్యుటేషన్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఏడీహెచ్ అమర్ సింగ్.. డీఎంహెచ్ వోతో పాటు ఇతర ఉద్యోగులపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ అంశాన్ని రికార్డు చేశానని. విచారణ నివేదికలో వాటిని పొందుపర్చి, ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.