కానిస్టేబుల్ అభ్యర్ధులకు దేహదారుఢ్య పరీక్షలు..
కానిస్టేబుల్ అభ్యర్ధులకు దేహదారుఢ్య పరీక్షలు..
మొదటి రోజు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు 190 మంది ఎంపిక..
కర్నూలు, డిసెంబర్ 30 (పీపుల్స్ మోటివేషన్):-
పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు ఏపీఎస్పీ 2 వ బెటాలియన్ లో మొదటి రోజు దేహదారుడ్య పరీక్షలు జరిగాయి.ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పర్యవేక్షించారు.
మంగళవారం రోజు 600 మంది అభ్యర్దుల ను పిలిచారు. 280 మంది అభ్యర్దులు బయోమెట్రిక్ కు హజరయ్యారు. వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. 1600 మీటర్ల పరుగు పరీక్షలో 240 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. 208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 100 మీటర్ల పరుగు పరీక్షలో 208 అభ్యర్థులు పాల్గొన్నారు. 134 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. లాంగ్ జంప్ లో 208 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. 187 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు మొదటి రోజు 190 మంది అర్హత సాధించారు. ఏదైనా సమస్యల పై , ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి 28 వ తేదీన హాజరు కాగలరని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు.