రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హాజరుకాని అభ్యర్థులు జనవరి 28 వ తేదీన హాజరుకావచ్చు..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

హాజరుకాని అభ్యర్థులు జనవరి 28 వ తేదీన హాజరుకావచ్చు..

>> 7 వ రోజు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహధారుడ్య పరీక్షలు..

>> కానిస్టేబుల్ మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 229 మంది అభ్యర్దులు ఎంపిక..




పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు APSP రెండవ బెటాలియన్ లో 7 వ రోజు దేహదారుడ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. గురువారం రోజు 600 మంది అభ్యర్దులను పిలిచారు. 320 మంది అభ్యర్దులు బయోమెట్రిక్ కు హజరయ్యారు. వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత ఎత్తు, ఛాతీ వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు.‌ అనంతరం వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. 1600 మీటర్ల పరుగు పరీక్షలో 251 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 100 మీటర్ల పరుగు పరీక్షలో 154 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. లాంగ్ జంప్ లో 225 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కానిస్టేబుల్ మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 7 వ రోజు 229 మంది అభ్యర్దులు అర్హత సాధించారు. ఏదైనా సమస్యల పై ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి 28 వ తేదీన హాజరు కాగలరని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు హోంగార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిస్పీలు, సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, డిపిఓ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Comments

-Advertisement-