ప్రతి మండలంలో ఒక ఆదర్శ గ్రామాన్ని తీర్చి దిద్దాలి
ప్రతి మండలంలో ఒక ఆదర్శ గ్రామాన్ని తీర్చి దిద్దాలి
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా పంట సాగులో మంచి ఫలితాలు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, ఏప్రిల్ 26 (పీపుల్స్ మోటివేషన్):- వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా పంట సాగులో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని ఉద్యాన శాఖ భవనంలో వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగం పై గ్రూప్ కన్వీనర్, కో - కన్వీనర్ లకు మరియు అధికారులకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం వ్యవసాయం మీద ఆధార పడి ఉన్న దేశమన్నారు.. వ్యవసాయంలో అభివృద్ధి ఉంటేనే దేశం, రాష్ట్రం ముందుకు వెళుతుందన్నారు. వ్యవస్థ్యంలో మంచి ఫలితాలు సాధించేందుకు, రైతుకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతికతను ప్రవేశపెడుతోందన్నారు. ఇందులో భాగంగానే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని అమలు చేస్తోందని తెలిపారు. వ్యవసాయ నిర్వహణను మెరుగుపరచడం, కార్మిక ఖర్చులను తగ్గించడం,పంట నాణ్యత, దిగుబడి పెంచడం, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం వంటి ఫలితాలను సాధించేందుకు డ్రోన్ల వినియోగం అమలు చేయడం జరుగుతోందని తెలిపారు.
డ్రోన్ లు వినియోగించుకోవడం ద్వారా ఎలాంటి లబ్ధి పొందరు?? ఆదాయం ఏ విధంగా వచ్చింది??? గతంలో ఎకరానికి ఎన్ని లీటర్ల స్ప్రే వినియోగించేవారు?? డ్రోన్ ద్వారా ఇప్పుడు ఎకరానికి ఎన్ని లీటర్ల స్ప్రే వినియోగిస్తున్నారు?? అని రైతులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.. ఈ విధంగా వ్యవసాయంలో డ్రోన్ వినియోగించుకోవడం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది అనే వివరాలను గ్రామాల్లో ఉండే ఇతర రైతులకు కూడా చెప్పాలని కలెక్టర్ రైతులకు సూచించారు...
జిల్లాలో 38 డ్రోన్ గ్రూప్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో 3 గ్రూపులకు శాంక్షన్స్ మంజూరు ఇచ్చమని, వాటికి త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఎల్ డి ఎం ను ఆదేశించారు..
ప్రతి మండలంలో ఒక ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.. వెయ్యి నుంచి 12 ఎకరాలతో ఉన్న ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని, అందులో అన్ని శాఖల కార్యక్రమాలను అమలు చేయాలన్నారు.. డ్రోన్ల వినియోగం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి, డ్రోన్లు లేకుండా ఫలితాలు ఎలా ఉంటాయి ప్రయోగాత్మకంగా చూపించాలన్నారు.. అలాగే ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఫలితాలు, సాధారణ సాగు వల్ల కలిగే ఫలితాలను, అర్ధ భాగం అగ్రికల్చర్ , అర్ధ భాగం హార్టికల్చర్, ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, డ్రిప్ ఇరిగేషన్ ఇలా అన్ని కార్యక్రమాలను ఒక గ్రామాల్లో చూపించాలని కలెక్టర్ వ్యవసాయ, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.
టెక్నాలజీ ని వినియోగించుకొని రైతులు ఏ విధంగా లాభపడతారు అన్న అనే విషయాన్ని వ్యవసాయ అధికారులు ఆలోచించి అమలు చేయాలని సూచించారు..గత సంవత్సరంలో 1000 ఎకరాల్లో వ్యవసాయం డ్రోన్ ఫార్మింగ్ చేశారన్నారు.. వాటి ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరింది ఎలాంటి ఫలితాలు వచ్చాయి అన్న విషయాలు రైతులకు తెలియచేయాలన్నారు. డ్రోన్లు వినియోగం ద్వారా లాభపడిన రైతుల విజయగాధలు, కరపత్రాల ద్వారా రైతులందరికీ డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు..అలాగే ప్రకృతి వ్యవసాయం విజయ గాధల ను తయారుచేసి రైతుల్లో అవగాహన పెంచాలని, తద్వారా సాగు పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.. గ్రామ స్థాయిలో కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది కూడా ఉన్నందున రైతులకు మరింత సాయం చేసే అవకాశం ఉందని, అధికారులు ఆ దిశగా పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ శాఖ ద్వారా చేస్తున్న అన్ని కార్యక్రమాల వివరాలను, సాగు విధానాలతో చిన్న బుక్లెట్ ను తయారు చేసి రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. డ్రోన్ ద్వారా సాయిల్ హెల్త్ కార్డ్ జనరేట్ చేసేందుకు వీలవుతుందా అని కృషి విజ్ఞాన కేంద్ర కో ఆర్డినేటర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు... బనవాసి కేంద్రం పక్కన ఉన్న పొలాలను డ్రోన్ ద్వారా శాటిలైట్ ఇమేజ్ తీసుకొని సాయిల్ హెల్త్ కార్డ్ లు జనరేట్ చేయడం సాధ్యమా అని ప్రయత్నించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి, ఎల్డీఎం రామచంద్రరావు, ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు, డ్రోన్ల గ్రూప్ కన్వీనర్, కో - కన్వీనర్ లు, రైతు సేవా కేంద్రం సిబ్బంది,వ్యవసాయ శాఖ అధికారులు, రైతుకు పాల్గొన్నారు.