రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష

• భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశం

• 3 నెలల్లో జాతీయ రహదారుల పెండింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని అధికారులకు ఆదేశం

• డిసెంబర్ 2026 నాటికి జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న మంత్రి..

• గ్రీన్ ఫీల్డ్ పోర్టులతో జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానంపై మంత్రి సమీక్ష

BC Janardhan Reddy

రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యలను త్వరితగతి పరిష్కరించుకుని, ఆయా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఒక నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.. నేడు సచివాలయంలోని ఆర్ & బీ శాఖ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ రహదారులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులతో 2 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. గతంలో డిసెంబర్ లో నిర్వహించిన తొలి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా అధికారులను అడిగి మంత్రి తెలుసుకోవడం జరిగింది..

జాతీయ రహదారుల ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని నిర్ణీత కాల వ్యవధిలో జాతీయ రహదారులను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు.. తొలుత జాతీయ రహదారుల ప్రాజెక్టులు (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), కేంద్ర రోడ్లు, రవాణా, హైవే మంత్రిత్వశాఖ (MoRTH) ఆధ్వర్యంలో) జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చించడం జరిగింది. తొలి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై సాధించిన ప్రగతిని అధికారులు మంత్రికి వివరించారు. గతంలో జాతీయ రహదారుల పనుల్లో భాగంగా సీనరేజీ ఛార్జీలు ముందస్తుగా చెల్లింపులు చేయడం జరిగేదని, ప్రస్తుతం బిల్లు వచ్చిన తర్వాత చెల్లించే వెసులుబాటు కాంట్రాక్టర్లు ఇవ్వడం జరిగిందని మంత్రికి తెలియజేశారు... జాతీయ రహదారులకు సంబంధించిన రోడ్ల మెటీరియల్, ఆయా రోడ్లపై వాడిన పక్షంలో దానిపై సీనరేజీ రాయిల్టీకి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.. అదే సమయంలో నేషనల్ హైవే ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక క్వారీలను ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించదని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 579 కి.మీ రోడ్ల భూసేకరణకు సంబంధించి 237 కి.మీ మేర భూసేకరణ పూర్తయ్యిందని తెలపడం జరిగింది. మిగిలిన భూసేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేసి, రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అటవీ శాఖ అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. NH ప్రాజెక్టుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి సెక్రటరీ స్థాయిలో వారానికి ఒకసారి సమావేశాలు నిర్వహించుకుని, వచ్చే 3 నెలల్లో అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, అడిషనల్ సీసీఎల్ ఎ ఎన్. ప్రభాకర్ రెడ్డి, ఏపీ సీసీఎఫ్ రాహుల్ పాండ్, (ఆర్ & బీ) శాఖ ఈఎన్సీ వి. రామచంద్ర, NHAI ప్రాంతీయ అధికారి ఆర్ కే సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.       

రైల్వే ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష

2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యంతో, అధికార యంత్రాంగం పనిచేయాలని రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో తొలి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సాధించిన ప్రగతిపై మంత్రి సమీక్షించారు.. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇండస్ట్రీయల్ కారిడార్లకు సంబంధించి ఓర్వకల్లు, కృష్ణపట్నం పారిశ్రామిక పట్టణాలను రైల్వే లైన్లకు అనుసంధానం చేయవల్సిందిగా మంత్రి ఆదేశించారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల లో రైల్వే సబ్ వే నిర్మాణాన్ని ప్రారంభించాల్సిందిగా రైల్వే అధికారులను ఆదేశించారు.. అనంతరం నడికుడి – శ్రీకాళహస్తి, కోటిపల్లి – నర్సాపురం, అమరావతి – ఎర్రుబాలెం నూతన రైల్వే మార్గాల భూసేకరణ అంశాలపై అధికారులతో చర్చించడం జరిగింది..

రాష్ట్రంలో మంజూరైన అన్ని రైల్వే మార్గాలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.. మంజూరు కాబడిన రైల్వే వంతెన పనులకు లెవల్ క్లోజర్ సర్టిఫికెట్ లను వెంటనే జారీ చేయాల్సిందిగా సంబంధిత జిల్లా కలెక్టర్ లను ఆదేశించడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.. రైల్వే వంతెన పనుల్లో సమన్వయం కోసం మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులను & విద్యుత్ శాఖ అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.. కోరాపూట్ – కొత్త వలస రైల్వే లైన్ అటవీ అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అమృత్ భారత్ లో మంజూరైన అన్ని రైల్వే స్టేష్టన్ లను ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికి సంకల్సించారు.. నిర్మాణంలో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబర్ లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, సౌత్ సెంట్రల్ రైల్వే సీఈ సూర్యనారాయణ, ఈస్ట్ కోస్ట్ రైల్వే సీఈ శ్రీనివాస్, రైల్వే సేప్టీ ప్రాజెక్ట్స్ సీఈ, మనోజ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.,  

గ్రీన్ ఫీల్డ్ పోర్టుల రోడ్లు – రైల్వే అనుసంధానంపై మంత్రి సమీక్ష

మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు సంబంధించిన కనెక్టివిటీ రోడ్లను జాతీయ రహదారులతో త్వరతితగతిన అనుసంధానం చేయాలని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు.. ఈ సమీక్షా సమావేశంలో భాగంగా రాష్ట్రంలో మారిటైమ్ బోర్డుకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది.. రాష్ట్రంలోని పోర్టులతో నేషనల్ హైవేలు, రైల్వే లైన్లకు అనుసంధానంలో కొన్ని చోట్ల తలెత్తిన పెండింగ్ సమస్యలు పరిష్కరించడం ద్వారా సీ పోర్టుల నిర్మాణం సకాంలో పూర్తికావడానికి తోడ్పాటందించినట్లువుతుందని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు తెలియజేశారు..

మారిటైమ్ బోర్డు అధికారులు లేవనెత్తిన పలు పెండింగ్ అంశాలు, గ్రీన్ ఫీల్డ్ పోర్టులకు రహదారుల అనుసంధానం వంటి సమస్యలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించి, వాటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాల్సిందిగా మంత్రి ఆదేశించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవులకు రైల్వే లైన్ల పనులను కూడా త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.. గ్రీన్ ఫీల్డ్ పోర్టులకు సంబంధించి పోర్టు రైల్వే సైడింగ్ కు సంబంధించి రైల్వే అధికారులతో చర్చించారు.. రామాయపట్నం పోర్టు రైల్వే సైడింగ్ కు సంబంధించిన పనులు వేగవంతం చేయవల్సిందిగా మంత్రి రైల్వే అధికారులను ఆదేశించారు.. మచిలీపట్నం, మూలపేట పోర్టులకు సంబంధించిన పోర్టు సైడింగ్స్ యొక్క ఇంజనీరింగ్ స్కేల్డ్ ప్లాన్స్ (ESP) అనుమతులు త్వరితగతిని ఇవ్వాలని రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు.. ఈ సమావేశంలో పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఆర్ యువరాజ్, మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, మారిటైం బోర్డు సీఈ జీవీ రాఘవరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

Comments

-Advertisement-