రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మేము కనపడే పోలీసులమైతే... మీరందరూ కనబడని పోలీసులు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మేము కనపడే పోలీసులమైతే.. మీరందరూ కనబడని పోలీసులు

Ap police tirupati police

తిరుమల, (పీపుల్స్ మోటివేషన్):-

తిరుమల తిరుపతి దేవస్థానం చీప్ విజిలెన్స్ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ వి. హర్షవర్ధన్ రాజు శుక్రవారం రోజు తిరుమల ఆస్థాన మండలంలో 400 టాక్సీ డ్రైవర్లుకు మరియు 50 ఓనర్లుకు భక్తుల పట్ల అనుసరించాల్సిన విధానాల గురించి అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా చీప్ విజిలెన్స్ అండ్‌ సెక్యూరిటీ అఫిసర్ వి. హర్షవర్ధన్ రాజు 450 మంది టాక్సి డ్రైవర్లు, ఓనర్లుతో ఇంట్రాక్ట్ అయ్యారు. తిరుమల భద్రతకు సంబంధించి డ్రైవర్లుది చాలా కీలకమైన పాత్ర అన్నారు. తిరుమలలో భద్రత, క్రమశిక్షణ, శాంతి భద్రతలు చాలా ముఖ్యమన్నారు. వాహన డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలను తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు పట్ల ప్రతి ఒక్క టాక్సీ డ్రైవర్ బాధ్యతగా, మర్యాదగా ప్రవర్తిస్తే మీ పేరు నలుదిశలా వ్యాపిస్తుందన్నారు.  అలా కాకుండా సంపాదనే ధేయ్యంగా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే నలుదిశలా మీకు చెడ్డ పేరు వస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొవాలన్నారు. కాబట్టి తిరుమలకు వస్తున్న భక్తులకు పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ... వారికి తెలియని విషయాలను అడిగిన వెంటనే సమాచారం ఇచ్చే విధంగా ప్రతి ఒక్క డ్రైవర్ వ్యవహరించాలన్నారు.

నిషేధిత వస్తువులు తిరుమలకు తీసుకురాకూడదని... నిషేధత వస్తువులు ఎవరు తీసుకు వచ్చిన మీ భాద్యతగా వ్యవహరించి వేంటనే పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. డ్రైవర్లు మద్య ఎలాంటి వివాదాలకు తావులేకుండా, డ్రైవర్లతో డ్రైవర్లు గొడవ పడకుండా ఉండాలన్నారు. పాసింజర్లు కోసం రోడ్డు మీద పడి గలాటలు చేసి... భక్తులకు ఇబ్బంది కలిగిస్తే సహించేదిలేన్నారు. మేము చెప్పిన విధంగా కాకుండా ఏ ఒక్క డ్రైవర్ అయిన పోలీసు నిబంధనలు ఉల్లంఘించినా అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేసవికాలంలో ప్రమాదాల రీత్యా వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొంది ఉండాలి మరియు వెహికల్ కండిషన్లో ఉండాలన్నారు. తమ వాహనాలలో భక్తులు ఏమైనా మర్చిపోతే బాధ్యతతో భక్తులకు చేర్చడం లేదా పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిన భాద్యత ప్రతి ఒక్క డ్రైవర్ పైన ఉందన్నారు. నేరస్తులుకాని, ఎవరైనా దొంగలు కాని మీ వాహనాలు ఎక్కినప్పుడు మీ కంట పడితే భద్రత దృష్ట్యా వేంటనే పోలీసు సిబ్బందికి కాని డయల్ 112 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా తిరుమలలో ఎవరైన భక్తులు మిస్సింగ్ అయినట్లు మీ సమాచారం వస్తే వేంటనే మీ వాట్సాప్ గ్రూపులో పోలీసు వారికి షేర్ చేయాలన్నారు. మీ డ్రైవర్లు గ్రూపులో మా పోలీసు వారు కూడా ఉంటారు.తిరుమలలో భద్రత, క్రమశిక్షణ, శాంతిభద్రత మాత్రమే ముఖ్యమైన అంశాలుగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత అనేది... ప్రతి ఒక్కరి చేతులలో ఉంటుందన్నారు. మేము కనపడే పోలీసులమైతే... మీరందరూ కనబడని పోలీసులన్నారు. ఒక్కొక్క సందర్భంలో మీరు ఇచ్చే చిన్న సమాచారమే... ఒక్కోసారి పెద్ద పెద్ద ఉపద్రవం నుండి కాపాడవచ్చనే సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించుకొవాలన్నారు. తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరూ... ఒక సైనికుడు లాగా పని చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో  ఐ.రామకృష్ణ అదనపు ఎస్పీ తిరుమల,  విజయ శేఖర్ డిఎస్పి తిరుమల,  N.T.V. రామ్ కుమార్ వి.జి.వో,  సురేంద్ర వీ. జి. వో,  సదాలక్షి తిరుమల, ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.బి.ఐ తిరుమల, సిఐలు మరియు విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

-Advertisement-