రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Swimming: ఈతకు వెళ్లి ఒకే గ్రామంలో నలుగురి మృతి.. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

Swimming: ఈతకు వెళ్లి ఒకే గ్రామంలో నలుగురి మృతి.. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి

• ఈత కోసం నీటిలో దిగి మునిగిపోయిన ఇద్దరు పిల్లలు..

• ఇద్దరు పిల్లలు సహా తండ్రీ, మరో విద్యార్ధి మృతి..

• అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలంలో ఘటన..

Swimming news

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మొలకలచెరువు మండలంలోని పెద్ద చెరువులో మునిగి నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ (36) బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్ళాడు. ఆయనతో పాటు కుమార్తె లావణ్య (12), కుమారుడు నందకిశోర్ (10), పిల్లల స్నేహితురాలు నందిని వెళ్ళారు. మల్లేశ్ బట్టలు ఉతుకుతుండగా, ఈత కొట్టేందుకు నందకిశోర్, నందిని చెరువులోకి దిగారు. వారు నీటిలో మునిగిపోతుండగా చూసిన లావణ్య పెద్దగా కేకలు వేస్తూ తమ్ముడిని రక్షించేందుకు ప్రయత్నిస్తూ నీటిలోకి దిగింది. వారి కేకలు విన్న మల్లేశ్ నీటిలో మునిగిపోతున్న ముగ్గురు పిల్లలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే నీటిలో పాచి ఎక్కువగా ఉండటంతో పిల్లలను బయటకు తీసుకురాలేకపోయారు. మల్లేశ్ కూడా వారితో పాటు నీట మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రప్పించి నలుగురి మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, అతని ఇద్దరు పిల్లలతో పాటు పక్కింటి విద్యార్థిని మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

వేసవి సెలవుల్లో పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి..

ఈ వేసవి కాలంలో పాఠశాల కు కళాశాల లకు సెలవులు కావడంతో పిల్లలు ఇంటి కే పరిమితవవుతారు పిల్లలు అందరు కలిసి సరదాగా ఆడుకోవటానికి బయటకు వెళ్తారు కాని తల్లి తండ్రులు పిల్లల పట్ల జాగత్త వహించాలి తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వలన అందరూ ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా. మారకూడ దు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత ను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు.

ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని ఈ విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.

Comments

-Advertisement-