రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బంగాళాఖాతంలో శక్తి తుపాను.. ఏపీ, తెలంగాణకు బిగ్ వెదర్ అలర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాల వారు బీ కేర్ ఫుల్..

Mounikadesk

బంగాళాఖాతంలో శక్తి తుపాను.. ఏపీ, తెలంగాణకు బిగ్ వెదర్ అలర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాల వారు బీ కేర్ ఫుల్..


Rain Alert: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇది తుపానుగా మారనుంది.

దీనికి శక్తి తుపాను అని పేరు పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వారంరోజుల పాటు ఏపీ, తెలంగాణసహా దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని, వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏపీలో ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాతావరణం మేఘావృతం అయ్యి ఉంటుంది. సాయంత్రం రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఆయా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణలో ఇవాళ అక్కడక్కడా భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. సాయంత్రం 5గంటల తరువాత పశ్చిమ తెలంగాణలో వర్షం మొదలై రాతంత్రా కురిసే అవకాశం ఉంది. గద్వాల్, మహబూ్ నగర్, నిజామాబాద్, బెల్లంపల్లి, జగిత్యాల ఇలా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, గాలి వేగాన్ని బట్టి వర్షం పడే ప్రాంతాలు మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Comments

-Advertisement-