తిరంగా యాత్ర ర్యాలీకి పోటేత్తిన ప్రజలు
తిరంగా యాత్ర ర్యాలీకి పోటేత్తిన ప్రజలు
• ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన యాత్ర
• బెంజ్ సర్కిల్ వరకు సాగిన యాత్ర
• యువత, మాజీ సైనికులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు
• ప్రజలు సంఘీభావం గా దేశాభిమానం చాటుతూ తిరంగా యాత్రలో పాల్గొనడంతో కిక్కిరిసిన బందర్ రోడ్డు
పహల్గాం లో ఉగ్రదాడులకు ప్రతిగా దేశ ప్రధాని మోదీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, శత్రుదేశం తోక ముడవడంతో మన సత్తా ప్రపంచానికి చాటి చెప్పడంతో దేశ ప్రజలు చేపట్టిన దేశవ్యాప్త తిరంగ యాత్ర కు మద్దతుగా శుక్రవారం తిరంగా యాత్ర ర్యాలీని విజయవాడ నడిబొడ్డున బందర్ రోడ్ లో నిర్వహించారు. ఈ తిరంగా యాత్రకు ప్రజలు, యువత, మాజీ సైనికులు, విద్యార్థులు చేతుల్లో జాతీయ జండాలను చేపట్టి పెద్ద సంఖ్యలో హజరుకావడం వారిలోని దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. తిరంగా యాత్ర ర్యాలీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతినుద్దేశించి ప్రసంగించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తిరంగా యాత్ర ప్రారంభమైంది. బందర్ రోడ్ లోని పీవీపీ మాల్, వివంతా హోటల్ ల మీదుగా బెంజ్ సర్కిల్ కు చేరుకుంది. తిరంగా యాత్రకు మద్దతుగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు జాతీయ జండాలు చేతబూని ముందుండి ర్యాలీని నడిపించారు. తిరంగా యాత్ర ర్యాలీకి వేల సంఖ్యలో ప్రజలు హజరై శత్రుదేశం దుచ్ఛర్యలపై మన దేశం ప్రతికారం తీర్చుకోవడంపై ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. మన దేశం ఒకరి జోలికి వెళ్లదు.. ఎవరైనా మన దేశం జోలికి వస్తే చావుదెబ్బ కొడతామని ప్రపంచానికి చాటినట్లయిందని యువత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ర్యాలీ లో భారత మాతకు జై అంటూ నినాదాలు మిన్నంటాయి.
బెంజ్ సర్కిల్ లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురందేశ్వరీలు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన రాష్ట్రానికి చెందిన మురళీనాయక్ అనే సైనికుడు దేశం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై దేశ సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమత్వం చాటి చెప్పే విధంగా దేశభక్తీ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. దేశభక్తి గీతాలు వీక్షకులను ఉర్రూతలూగించాయి.