సైనికుల శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుద్దాం
సైనికుల శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుద్దాం
దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలకు సెల్యూట్
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
మన సైనికులకు అండగా ఉందాం
రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులు వై.సత్య కుమార్ యాదవ్
అనంతపురము, మే 17:
సైనికుల శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుద్దామని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తెలుపుతూ తిరంగా యాత్ర నిర్వహించారు. శనివారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ నుండి ప్రారంభమై టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు నిర్వహించిన తిరంగా యాత్రను రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. మంత్రులతోపాటు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ నారాయన్ శర్మ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూర రెడ్డి, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి , మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ సైనికులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, అన్ని వర్గాల నగర ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు, ఎన్జీఓలు, సామాజిక సంస్థలు, విద్యావేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్స్, వ్యాపార సంస్థలు, టీచర్లు, పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ..
సరిహద్దుల్లో ప్రాణాలను వడ్డేసి నిలిచిన సైనికులకు, సైనిక శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుస్తూ దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి తరంగా యాత్రలో భాగంగా ఈరోజు నా అనంతపురం జిల్లాలో హాజరైన వేలాదిమందిక్ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నామన్నారు. దేశం ఒక్కటే అన్నటువంటిది మన గుండెచప్పుడని ఈరోజు అర్ధం అవుతుంందన్నారు. ఇంత ఉదయాన్నే వేలమంది ఇక్కడ హాజరయ్యారంటే దేశభక్తి ప్రతి గుండె చప్పుడుగా మారింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరంలేదన్నారు. మొన్నటి దాకా సైన్యంలో పనిచేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి అయిన ఎం.మురళి నాయక్ ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందని, వారు మన రక్షణ కోసం చేసినటువంటి త్యాగాలకు బాసటగా నిలవాలన్నారు. త్రివిధ దళాలకు సంబంధించిన సైన్యానికి మద్దతుగా ఈ దేశం మీ వెనకాలే ఉందని, దేశం కోసం మీరు చేస్తున్న త్యాగాలకు దేశం గుర్తిస్తున్నదని మేము మీకోసం సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఈ భారతదేశం మొత్తం మీ వెనకాలే నడుస్తామని చెప్పడానికి మద్దతుగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం తోడుగా నడవడానికి జరుగుతున్నటువంటి ఈ తరంగా యాత్రలో మనమంతా భాగస్వాములు అయినందుకు ఈ రోజున గర్విస్తున్నామని అన్నారు.
రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ..
మన సైనికులకు అండగా ఉందామన్నారు. పహాల్గం ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హతమార్చడం జరిగిందని, ఇందుకు దేశమంతా బరువెక్కింది, ప్రతి భారతీయుడు కళ్ళు ఎరుపెక్కాయన్నారు. మనందరి మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం సమర్థ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాకిస్తాన్ వారికి సమాధానం గట్టిగా చెప్పిందని, దేశంలో అమాయకులపై దొంగ చాటుగా దెబ్బతీస్తే మనం ముందుగానే వారికి చెప్పి ఆ ఉగ్రవాద శిబిరాలపై దాడిలు చేసి పాకిస్తాన్ పౌరులకి ఎలాంటి గాయం కాకుండా కేవలం ఉగ్రవాదులు, ఉగ్రవాద శిబిరాలయాలే లక్ష్యం చేసుకుంటూ మన సైన్యం ధ్వంసం చేసిందని తెలిపారు. మొత్తం ప్రపంచం యావత్తు మన దేశ సైన్యం శక్తి సామర్ధ్యాలపై ఆశ్చర్యం పొందే విధంగా చేసిందని, ప్రతి భారతీయ పౌరులను తలెత్తుకునే విధంగా మన సైన్యం చేశారన్నారు. మన ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి ఒక సైనికుడు మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం, వారి అంతక్రియలకు మనమంతా పాల్గొనడం జరిగిందని తెలిపారు. వారి కుటుంబాలను వారి ఊరుని వదిలి అనేక ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దుల్లో మనమంతా సురక్షితంగా ఉండాలని ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న మన సైనికులు అందరికీ మన మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని, ఇవాళ మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకతీతంగా, మతాలకతీతంగా జరుగుతున్న తిరంగా యాత్రలో జాతీయ పతాకాన్ని భుజాన వేసుకుని సైనికులు అండగా నిలబడడం, మన సైనికుల వెంట ఇన్ని వేల కోట్ల మంది ఉన్నారని ఒక సందేశాన్ని పంపడం జరిగిందన్నారు. విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, రాష్ట్రాలు ఉన్న మన దేశంలో అందరూ ఒకే తాటిపై వచ్చి సైనికులకు అండగా నిలబడ్డం మన దేశ సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు వాటిల్లో ప్రయత్నం చేసినా మనం చూస్తూ ఊరికే ఉండరని, ప్రజలందరూ ఒక తాటిపై వస్తారని ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా మన అనంతపురం పట్టణంలో ఇంతమంది ఉదయాన్నే ఎవరు ఎటువంటి ప్రయత్నం చేయకుండా స్వచ్ఛందంగా సైనికులకు మద్దతు తెలిపేందుకు ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ..
పహాల్గం ఉగ్రదాడికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులను అణచడానికి మన భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా, దేశరక్షణ, సరిహద్దుల రక్షణలో అహర్నిశలు నిమగ్నమైన త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్దఎత్తున స్వచ్ఛందంగా అనంతపురం నగర ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు, ఎన్జీఓలు, సామాజిక సంస్థలు, విద్యావేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్స్, వ్యాపార సంస్థలు, టీచర్లు, పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ తదితరులు పాల్గొని మన సైనికులకు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామని తెలియజేసారన్నారు.
ఎంపి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు భారత దేశ త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగ యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని,
గత నెలలో జరిగినటువంటి పహల్గాం లాంటి సంఘటనలు నిరసనగా ప్రతి దాడి చేస్తూ ఆపరేషన్ సింధుర్ కార్యక్రమం ద్వారా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు హెచ్చరిక చేస్తున్నామని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని, దేశంపై చూపు పడితే మీకు చూపు ఉండదని, భవిష్యత్తులో ప్రపంచ పటంలో మీ పేరు కూడా లేకుండా చేస్తామని చెప్పారు. పాకిస్తాన్ లో మన భారతదేశ సైన్యం ఉగ్రవాద స్థావరాలను ఉగ్రవాదులను అణిచివేసే కార్యక్రమం చేశారని తెలిపారు. భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రపంచ దేశాలకు తెలియజేశారన్నారు. భారతదేశ సరిహద్దులో అందరి కోసం రాత్రి, పగలు కష్టపడుతూ వర్షానికి, ఎండలకు లెక్కచేయకుండా వారి కుటుంబాలను, ఊరిని వదిలిపెట్టి భారతదేశం కోసం సైనికులు పోరాటం చేస్తున్నారని, వారికి వందనాలు తెలియజేస్తున్నామన్నారు.
తిరంగా యాత్ర అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ నుండి ప్రారంభమై టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం చేరుకుని జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, అనంతపురం ఆర్డిఓ కేశవ నాయుడు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప, డివిఈఓ వెంకటరమణా నాయక్, డీఈఓ ప్రసాద్ బాబు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.వేంకటేశ్వరరావు, డిఎంహెచ్వో ఈబి.దేవి, డిసిహెచ్ఎస్ పాల్ రవికుమార్, ప్రజా ప్రతినిధులు, మాజీ సైనికులు, ఆయా శాఖల జిల్లా అధికారులు, అన్ని వర్గాల నగర ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు, ఎన్జీఓలు, సామాజిక సంస్థలు, విద్యావేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్స్, వ్యాపార సంస్థలు, టీచర్లు, పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ పాల్గొన్నారు.