Jobs: నెలకు రూ.60 వేల జీతం... జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Jobs: నెలకు రూ.60 వేల జీతం... జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
• ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా శాఖలో 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు..
• కాంట్రాక్టు పద్ధతిలో ఏడాది కాలానికి నియామకం..
• ఎంబీఏ లేదా పీజీ ఉత్తీర్ణత అర్హత
ఎంపికైన వారికి నెలకు రూ.60,000 వేతనం..
• నియోజకవర్గాల విజన్ ప్లాన్, P4 కార్యక్రమ సమన్వయానికి నియామకాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన, ప్రభుత్వ P4 కార్యక్రమాల సమన్వయం కోసం ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలు ఏడాది కాలానికి ఒప్పంద పద్ధతిలో జరుగుతాయి. అభ్యర్థుల పనితీరు, అవసరాల ఆధారంగా ఈ కాంట్రాక్టు కాలాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిగ్రీని కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 చొప్పున వేతనం చెల్లించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. వయోపరిమితి విషయానికొస్తే, 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో మే 13వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను ప్రామాణికంగా తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం, వేతనం తదితర పూర్తి వివరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://apsdpscareers.com/YP.aspx వెబ్ పోర్టల్ను సంప్రదించాలి.