గడువులోగా గృహనిర్మాణాలను పూర్తి చేయాలి l
గడువులోగా గృహ నిర్మాణాలను పూర్తి చేయాలి
-రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కోలుసు పార్ధ సారధి ఆదేశం
విజయయవాడ:రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న గృహాలను వెంటనే పూర్తీ చేయాలని,కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్దేశించిన 3 లక్షల గ్రుహాలనిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కోలుసు.పార్ధసారధి అధికారులను ఆదేసించేరు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒకేసారి 3 లక్షల మందికి గృహనిర్మాణాలు పూర్తీ చేసి లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేసించేరని ఆయన అన్నారు.రాష్ట్రంలో అమలు జరుగుతున్నా గృహనిర్మాణాల పనితీరు ఫై మంత్రి శనివారం విజయవాడలోని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించేరు,ఈ సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్,రాష్ట్రంలోని అన్ని జిల్లాల గృహనిర్మాణ సంస్థ అధికారులు,ఫీల్డ్ అధికారులు పాల్గొన్నారు.జిల్లా అధికారులు అందరూ నిత్యం లే ఔట్లలో ఉండి లబ్దిదారులతో నిర్మాణాలను పూర్తీ చేయటానికి చర్యలు తీసుకోవాలని,నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేసించేరు.కింది స్థాయి సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించాలని,ఇళ్ళ నిర్మాణాలలో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,నిర్మాణాలకు అవసరమైన సిమెంట్,ఇసుక లబ్దిద్దర్లకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని,లేఔట్లలో రహదారులు,విద్యుత్,మంచినీరు వంటి మౌలిక వసతులు కల్పించటానికి చర్యలు చేపట్టాలని మంత్రి పార్ధ సారధి అధికారులకు దిశా నిర్దేశం చేసేరు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల గృహనిర్మాణ శాఖ అధికారులుతో మాట్లాడి ఇల్లనిర్మాణాల పురోగతిని తెలుసుకొని,సత్వరం నిర్మాణాలు పూర్తీ చేయటానికి అవసరమైన చర్యలను మంత్రి సూచించేరు.రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో గృహనిర్మాణాల అమలు జరుగుతున్న తీరును మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.ప్రతి రోజు జిల్లా అధికారులుతో సమీక్షలు నిర్వహిస్తూ నిర్మాణాలలో వేగం పెంచుతున్నామని ఆయన మంత్రికి వివరించేరు.
ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంజినీర్ వేణుగోపాల్,సుపరెండేంట్ ఇంజినీర్ జయరామాచారి,చీఫ్ జనరల్ మేనేజర్ అన్నపూర్ణ,ఇతర అధికారులు పాల్గొన్నారు