రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలి

International Yoga Day yogandhracampaign yogandhrapratibha Yogandhra Andhra Pradesh
Mounikadesk

 ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలి

  • యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరం
  • జనవరిలో గుత్తి కోట ఉత్సవాలు నిర్వహించేందుకోసం రూ. 50 లక్షలు మంజూరు
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
  • గుత్తి కోట గుర్రపు శాలలో యోగాంధ్ర- 2025లో భాగంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు..

అనంతపురం, జూన్ 02 :

2027 జనవరి నెలలో గుత్తి కోట ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షలు మంజూరు కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం గుత్తి పట్టణంలోని గుత్తి కోట గుర్రపు శాలలో యోగాంధ్ర- 2025లో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, గుంతకల్ ఆర్డీవో శ్రీనివాస్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా పర్యాటక అధికారి జయకుమార్, జిల్లా అధికారులు, గుత్తి పట్టణ ప్రజలు, వివిధ శాఖలకు చెందిన మండల అధికారులు, గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, విద్యార్థినీ విద్యార్థులు,యోగా సాధకులు, గుత్తి కోట పరిరక్షణ సమితి సభ్యులు, తదితరులు యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం యోగా మాసంలో భాగంగా జిల్లాలో 4 పర్యాటక ప్రదేశాలలో ఒకటైన గుత్తి కోటను యోగాంధ్ర కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. చారిత్రాత్మకమైన గుత్తి కోటలో ఈరోజు ఉదయం 7.00 గంటల నుంచి 8:30 వరకు యోగా అభ్యాసాన్ని చేయడం జరిగిందన్నారు. ముందుగా కోట కింద నుంచి పైకి 20 నిమిషాలు ఎక్కడం ఒక వ్యాయమమని, పైకి వచ్చాక స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని యోగా చేయడం జరిగిందని, దాదాపు వేల మంది జిల్లా, మండల అధికారులు, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు, యోగా సాధకులు అందరితో కలిసి చల్లని గాలితో చక్కటి వాతావరణంలో యోగా చేయడం చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉందన్నారు. అందరూ యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటూ ఆరోగ్యమైన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని, దాని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. తద్వారా ఆసుపత్రులలో రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. గుత్తి కోటను అభివృద్ధి చేయాలని స్థానిక సంఘాలు, ప్రజలు అడగడం జరిగిందని, ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని, గుత్తి ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి నెలలో నిర్వహించడానికి ప్రభుత్వం 50 లక్షలు మంజూరు చేసిందన్నారు.గుత్తి కోటను క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఇక్కడున్న సంఘాలతో చర్చిస్తామని, గుత్తి కోట అభివృద్ధికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. గుత్తి కోట కు మరింత ప్రాచర్యం కల్పించే ఉద్దేశంతో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా స్థానిక యోగా గురువు కృష్ణయ్య, గుత్తి కోట పరిరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ లను శాలువాలతో జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు స్థానిక మహర్షి దయానంద గురుకులంకు చెందిన ఎన్ సి సి విద్యార్థిని, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖకు చెందిన యోగా గురువులు గురు రాజారావు, కృష్ణవేణి, స్థానిక తహసిల్దార్ ఓబులేసు, ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.


Comments

-Advertisement-