రైతుగా మారిన కలెక్టర్
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Mounikadesk
రైతుగా మారిన కలెక్టర్
- ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనులు ప్రారంభం
- ఈ ఏడాది మంచి వర్షాలు రావాలి.. పంటలు బాగా పండాలి
- ప్రతి రైతుకి అండగా ఉంటాం.. రైతు సేవా కేంద్రాల నుంచి రైతులకు అవసరమైనవి అందజేస్తాం
- కూడేరు మండలం కొర్రకోడులో ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ పొలంలో ఎద్దులతో, నాగలితో దుక్కి దున్ని విత్తనం వేసిన జిల్లా కలెక్టర్
అనంతపురం, జూన్ 11 :
- ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు పంటలను సాగు చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని, ఈ ఏడాది మంచి వర్షాలు రావాలని, పంటలు బాగా పండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆకాంక్షించారు. బుధవారం ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం కొర్రకోడు గ్రామం పరిధిలో "ఏరువాక పౌర్ణమి" సందర్భంగా వ్యవసాయ పొలంలో విత్తనం వేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి జేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా వ్యవహరిస్తున్నారని, ఈ రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులందరూ తమ పొలాల్లో భూమి పూజ చేస్తారన్నారు. సంస్కృతిలో భాగంగా పూజ చేసి మంచి వర్షాలు రావాలని.. మంచి పంటలు పండాలని వ్యవసాయానికి వాడే పరికరాలను, పశువులను శుభ్రం చేసి పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని, ప్రతి జిల్లాలోనూ ఖరీఫ్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే వేరుశనగ, ఇతర విత్తనాల పంపిణీ మొదలైందని, జిల్లాకు కేటాయించిన విత్తన పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేశామని, 2025-26వ సంవత్సరానికి సంబంధించి లక్ష్యాన్ని తయారు చేసుకున్నామన్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పలు రకాల రైతుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 40 శాతం వర్షం అధికంగా వచ్చే అవకాశం ఉందని, ఈ సంవత్సరం సకాలంలో వర్షం రావాలని కోరుకుంటున్నామన్నారు. గత ఏడాది కూడా 40 శాతం అధికంగా వర్షం కురవడం జరిగిందని, సకాలంలో కురువకపోయినా వర్షం వల్ల భూగర్భజలం పెరిగిందన్నారు. ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని, రైతు సేవా కేంద్రాల నుంచి రైతులకు అవసరమైనవి అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహంగాను రైతులకు మినీ కిట్స్ అందిస్తున్నామని, పలువురు రైతులకు రాగి, కంది మినీ కిట్స్ ను జిల్లా కలెక్టర్ అందజేశారు. అనంతరం రైతులకు వేరుశనగ విత్తనాలను, సాయిల్ హెల్త్ కార్డులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.
- ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, డిసిఓ అరుణకుమారి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, కార్డు ఎన్జీవో నిర్మలారెడ్డి, ఏవో విజయ్ కుమార్, ఎంపీడీవో కుళ్లాయి స్వామి, హౌసింగ్ ఏఈ అశోక్, ఏపీవో పోలేరయ్య, ఏవోలు బాల నాయక్, సోమశేఖర్, రాకేష్, ఆయా శాఖల అధికారులు, ఎంపిఈఓ, రైతులు పాల్గొన్నారు.
Comments