రైతులకు అధిక దిగుబడులు సాధించే విధిగా వ్యవసాయ అధికారులు సలహాలు ఇవ్వాలి
రైతులకు అధిక దిగుబడులు సాధించే విధిగా వ్యవసాయ అధికారులు సలహాలు ఇవ్వాలి
"రైతులకు సకాలంలో నాణ్యమైన వేరుశనగ విత్తనం పంపిణీ"
పెడపల్లి లో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ గారు..!
సూపర్ సిక్స్ పథకాలు సక్రంగా అమలు చేయుచున్నాము
మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ
పెడపల్లి, జూన్ 10: వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ పేర్కొన్నారు. మంగళవారం పెడపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఖరీఫ్ సీజన్ ద్వారా వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ
పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో స్థానిక రైతు సేవ కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వం రాయితీ పై అందించిన వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం లో భాగంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి వేరుశనగ విత్తనాలను పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులకు అధిక దిగుబడులు వచ్చే విధంగా నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక మద్దతు ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న వేరుశనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే రైతులు సమయానికి సాగు పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు పంట సాగు విషయంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని, గ్రామాల్లో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి నెల వివిధ సామాజిక భద్రత పెన్షన్లు ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజే పంపిణీ చేయుచున్నామని తెలిపారు, ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల కష్టాలు చూసి చంద్రబాబు నాయుడు, కృష్ణా జలాలను రాయలసీమకు అందజేసిన మహనీయుడని తెలిపారు, ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు పండించిన పండ్లు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని మంత్రివర్యులు తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రిప్ వ్యవసాయం ద్వారా ఎస్సీ ఎస్టీ రైతులకు ఐదు ఎకరాలు ఉన్న ఉచితంగా డ్రిప్ పరికరాలు అందజేయడం జరిగిందని. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి 20 వేల రూపాయలు అంత చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు రైతులు నాణ్యమైన విత్తనాలు పొంది మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. మంత్రివర్యులు చేతుల మీదుగా లబ్ధిదారులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వై వి సుబ్బారావు, సర్పంచ్ మంగ్లీ బాయ్, జడ్పిటిసి మెంబర్ జి లక్ష్మీనరసమ్మ, ఆర్డీవో సువర్ణ సామకోటి ఆదినారాయణ, సోమశేఖర, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.