మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Mounikadesk
మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది
- నాణ్యమైన మామిడికాయలను వివిధ ప్రవేట్ కంపెనీలకు రైతులు సరఫరా చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు 168 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో అందజేస్తుంది
- రాష్ట్ర వ్యవసాయ, సహకార అనుబంధ రంగాల శాఖ మంత్రివర్యులు కే అచ్చం నాయుడు
చిత్తూరు, జూన్ ,14: రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవడానికి సబ్సిడీ రూపంలో 168 కోట్ల రూపాయలు చెల్లిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అనుబంధ రంగాల శాఖ మంత్రివర్యులు అచ్చం నాయుడు తెలిపారు. జిల్లాలో ఒక్కరోజు అనగా శనివారం పర్యటనలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల మండలంలో గొల్లమడుగు నందు మామిడికాయల నిల్వ ఉంచిన పండ్ల యూనిట్ను పరిశీలించుచున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ D. ప్రసాద్ రావు, హర్ట్ కల్చర్ సెక్రెటరీ రాజశేఖర్ బాబు, ఆర్టికల్చర్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంపెనీ నందు మామిడికాయ ప్రాసెస్ యూనిట్లను పరిశీలించారు. మామిడికాయ జ్యూస్ ఎలా తయారవుతాదో పరిశీలించారు అనంతరం పల్లూరు నందు మామిడి రైతులతో ముచ్చటించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రివర్యులు మాట్లాడుతూ రైతులను అన్ని విధాల ఆదుకోవడానికి తెలుగు దేశ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆలోచనతో మామిడి రైతులను ఆదుకోవడానికి ఈరోజు కంపెనీలతో చర్చించి ఒక ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు వివిధ కంపెనీలు 8 రూపాయలకే కేజీ మామిడి పండ్లు ధర నిర్ణయించడం జరిగిందని 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో రైతులకు వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల స్వేచ్ఛగా వారు పండించిన మామిడి పంటను, మండిళ్లలో గాని, మార్కెట్లో గాని అమ్ముకోవచ్చునని తెలిపారు, సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు చివరి కాయ వరకు విక్రయించుకోవచ్చునని.2019వ సంవత్సరంలో జిల్లాలో మామిడి ధర తెలుగుదేశం ప్రభుత్వమే 7.50 పైసలకు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రైతులు నాణ్యమైన మామిడికాయలను కంపెనీలకు సరఫరా చేయాలని ఆదేశించారు. మామిడి రైతులకు 168 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో అందజేస్తున్నామని మంత్రివర్యులు తెలిపారు.
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేయుచున్నాడని తెలిపారు. రైతులు మార్కెట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద మామిడికాయలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం 22 మెట్రిక్ టన్నులు మామిడికాయలను కొనడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments