బ్రహ్మోస్ ఏరోస్పేస్ మరింతగా విస్తరించండి
బ్రహ్మోస్ ఏరోస్పేస్ మరింతగా విస్తరించండి
బ్రహ్మోస్ ఏరోస్పేస్ (BrahMos Aerospace) సంస్థను మరింతగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు అనుకూలమైన ప్రాంతంగా ముఖ్యమంత్రి గారు వివరించారు.
బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. BrahMos ఏరోస్పేస్ ఎండీ, సీఈఓ డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి గారు, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్ గారు, DRDL జీఏ శ్రీనివాస మూర్తి గారితో పాటు పలువురు ముఖ్యమంత్రి గారిని కలిశారు.
దేశంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశమని ముఖ్యమంత్రి గారు ఆ ప్రతినిధి బృందానికి వివరిస్తూ, బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణ కోసం తెలంగాణ, హైదరాబాద్ను ఎంచుకోవాలని కోరారు. అందుకు ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది.