ద్విచక్ర వాహనాలు దొంగలించే నిందితుడు అరెస్టు
ద్విచక్ర వాహనాలు దొంగలించే నిందితుడు అరెస్టు
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
•రూ. 35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
•మూడున్నర నెలల్లోనే 5 వేల సిసి టివి కెమెరాలు ఏర్పాటు చేశాం.
•సిసికెమెరాల సహాయంతో ఈ కేసును సులువుగా చేధించాం.
•కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) మరియు MP నిధులతో మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాం.
•గస్తీలు పెంచి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తాం.
35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు దొంగలించిన నిందితున్ని గోనెగండ్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో నిందితుని వివరాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ...
•కర్నూలు, ఎమ్మిగనూరు , గోనెగండ్ల ప్రాంతాలలో బైక్ లు దొంగలిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ముద్దాయిని పట్టుకోవడాని చర్యలు చేపట్టామన్నారు.
•ఈ రోజు గోనెగండ్ల మండలం కు చెందిన కుర్వ వెంకటేష్ నుండి 30 బైక్ లు రికవరీ చేయడం జరిగిందన్నారు. కర్నూలు , ఎమ్మిగనూరు, గోనెగండ్ల, దేవనకొండ , కోడుమూరు , ఓర్వకల్లు తదితర ప్రాంతాలలో 30 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు ఒప్పుకున్నాడన్నారు.
•ఆ బైక్ చాస్ నెంబర్ ద్వారా బైక్ లకు సంబంధించిన ఓనర్లకు బైక్ లు అప్పగిస్తామన్నారు. మరొ ఇద్దరు బైక్ నిందితులు ఉన్నట్లు తెలిసింది, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. మరిన్ని బైక్ లను కూడా రికవరి చేస్తామన్నారు. చోరి చేసిన బైక్ లను జొన్నగిరి ప్రాంతాలలో పొలాల పనులు చేసుకునే రైతులకు అమ్మివేశాడన్నారు.
•పొలలాకు వెళ్లే రైతులకు రూ. 4 వేలు, 5 వేలకు ఇద్దరి కి అమ్మివేశాడన్నారు. పార్కింగ్ చేసిన వాహనాలను అప్పటికప్పుడు దొంగలించడం, వెంటనే అమ్మి వేయడం చేసేవాడన్నారు. పోలీసుల తనిఖీల్లో దొంగలించిన వాహనాలు బయట పడ్డాయన్నారు.
•28 బీట్స్ ను అన్నింటిని ఈ - బీట్స్ గా చేశామన్నారు. గస్తీలు పెంచి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
•జిల్లాలో మూడు న్నర నెలల్లోనే దాదాపు 5 వేల సిసిటివి కెమెరాలను ప్రజల సహాకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఆ సిసి కెమెరాల సహాయంతో ఈ కేసును సులువుగా చేధించడానికి వీలయిందన్నారు.
•కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలలో కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) మరియు MP నిధులు, మున్సిపల్ నిధులతో మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
•ఎక్కడైనా వాట్సాప్, టెలి గ్రాం గ్రూపులలో APK పైల్స్ వస్తే వాటిని క్లిక్ చేయకూడదు, ఒపెన్ చేయకూడదన్నారు. మీడియా వారు కూడా సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన చేయాలన్నారు.
ముద్దాయి వివరాలు:-
1.కురువ వెంకటేష్, వయస్సు:20 సంవత్సరాలు, తండ్రి పేరు:కురువ బజారీ, పెద్దమర్రివీడు గ్రామం, గోనెగండ్ల మండలం. కర్నూల్ జిల్లా.
నిందితుని నుండి స్వాధీనం చేసుకొన్నవి....రూ. 35 లక్షల విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలు
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ SDPO ఉపేంద్ర బాబు ఆధ్వర్యంలో గోనెగండ్ల CI O. విజయ భాస్కర్ మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి గోనెగండ్ల పోలీసు స్టేషన్ క్రైమ్ నెం. 140/2025 U/Sec 303(2) BNS-2023 & Cr. No. 141/2025 U/Sec 303(2) BNS-2023 కేసులోని ముద్దాయిని ఈ రోజు ఉదయం 6 గంటల కు రాబడిన సమాచారం మేరకు గోనెగండ్ల గ్రామం ఊరి బయట పెద్దమర్రివీడు గ్రామం రోడ్డు లో గల సు౦కులమ్మ గుడి వద్ద ద్విచక్ర వాహనాలు దొంగిలించిన ముద్దాయిని అరెస్ట్ చేశారు.
నిందితుని నేపథ్యం:
నిందితుడు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఇతనికి మద్యం, తదితర చెడు అలవాట్లు ఉండటంతో కూలి పనుల నుండి వచ్చే ఆదాయం ఖర్చులకు మరియు కుటుంబ పోషణ కు సరిపోయేది కాదు. ఎలాగైనా సులువుగా డబ్బులు సంపదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మోటార్ బైక్ లను దొంగిలించడము చాల సులభమని చెప్పుకోచ్చాడు. బస్టాండ్లు మరియు ఇళ్ల ముందర పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసుకున్నాడు. నకిలీ తాళాల సహాయంతో ద్విచక్ర వాహనాలను అపహరించడం మొదలు పెట్టాడు. వీటన్నింటినీ గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో తన పాత ఇంటిలో దాచిపెట్టాడు.
నగదు రివార్డులతో అభినందించిన .. జిల్లా ఎస్పీ
ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేయడంలో కృషి చేసిన గోనెగండ్ల సి.ఐ O. విజయ భాస్కర్ మరియు HC’s, N. తేజేశ్వర కుమార్, U. దేవరాజు PC’s Y.రాజు, K.లక్ష్మీకాంత్, E. వీరేష్ గౌడ్, M. బ్రహ్మయ్య , G. శ్రీనివాసులు, S. రమేష్ లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నగదు రివార్డులు అందజేసి అభిన౦దించారు.