బాధితులకు సత్వర న్యాయం అందించండి.
బాధితులకు సత్వర న్యాయం అందించండి.
పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్
రాయచోటి, జులై 21 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి రాలేని వారు జిల్లాలోని పోలీసు స్టేషన్లు, సర్కిల్, సబ్ డివిజన్ కార్యాలయాలలో అర్జీలు సమర్పించవచ్చన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని సత్వరం న్యాయం చేస్తామన్నారు.
దివ్యాంగుడి వద్దకు ఎస్పీ..
పెద్దమండెం మండలం కలిచర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు సీమలచెరువు గంగాధర్ నడవలేని పరిస్థితిలో తన సమస్యను చెప్పుకునేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అతని వద్దకే వెళ్లి సమస్య విన్నారు. అతను ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ చట్ట పరిధిలో అతని సమస్యను పరిష్కరించాలని, ములకలచెరువు సిఐ ని ఆదేశించారు.