రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భారత్-ఐరోపా మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (TEPA)…

Current Affairs Today Current Affairs news Current Affairs PDF Current Affairs of India Today Current Affairs PDF Daily current affairs Latest GK&CA
Mounikadesk

భారత్-ఐరోపా మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (TEPA)…

భారతదేశం మరియు ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (European Free Trade Association - EFTA) మధ్య కుదిరిన వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (Trade and Economic Partnership Agreement TEPA) ఈ ఒప్పందం 2025 అక్టోబరు 1 నుండి అమల్లోకి రానుంది.

EFTA సభ్య దేశాలు: EFTA అనేది నాలుగు ఐరోపా దేశాల సమూహం.

1. ఐన్లాండ్

2. లీచ్టెన్స్టెయిన్

3.నార్వే

4. స్విట్జర్లాండ్

ఈ దేశాలలో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మిగిలిన మూడు దేశాలతో భారతదేశ వాణిజ్యం సాపేక్షంగా తక్కువగా ఉంది.

పెట్టుబడులు మరియు ఉపాధి కల్పన:

మొత్తం పెట్టుబడి: EFTA దేశాలు భారతదేశంలో 15 ఏళ్ల కాలంలో $100 బిలియన్లు (సుమారు రూ. 8.5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టాలి.

విడతల వారీగా పెట్టుబడి:

మొదటి 10 ఏళ్లలో $50 బిలియన్లు.

తరువాత 5 ఏళ్లలో మరో $50 బిలియన్లు.

ఉద్యోగ కల్పన: ఈ భారీ పెట్టుబడుల ద్వారా భారతదేశంలో 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా.

సుంకాల తగ్గింపు మరియు ఉత్పత్తులపై ప్రభావం:

ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత, EFTA దేశాల నుండి దిగుమతి అయ్యే అనేక ఉత్పత్తులపై సుంకాలు తగ్గించబడతాయి లేదా పూర్తిగా తొలగించబడతాయి.

ప్రధాన ఉత్పత్తులు: స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్-పాలిష్ చేసిన వజ్రాలు, బిస్కెట్లు వంటి స్విస్ ఉత్పత్తులు భారతదేశంలో తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. ఇది భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య చర్చల అయిదో విడత ముగింపు:

భారతదేశం మరియు అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నాయి.

అమెరికా గతంలో భారతదేశం సహా పలు దేశాలపై 26% సుంకం విధించింది.

ఈ సుంకాల అమలును 2025 ఆగస్టు 1 వరకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి.

భారత బృందానికి వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నాయకత్వం వహించారు.

చర్చించిన ప్రధాన అంశాలు:

వ్యవసాయం: వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు మరియు వాణిజ్య అడ్డంకులు.

వాహన సంబంధిత అంశాలు: వాహన రంగంలో వాణిజ్యం మరియు నియంత్రణలు.

అమెరికా డిమాండ్: అమెరికా, భారతదేశంలోని డెయిరీ మరియు వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల్లో రాయితీ ఇవ్వాలని కోరుతోంది.

Comments

-Advertisement-