రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భారత విద్యా రంగంలో కొత్త రికార్డు: ఉపాధ్యాయుల సంఖ్య మొదటిసారిగా-1 కోటికి దాటింది - UDISE+ 2024-25 నివేదిక వెల్లడి……

Current Affairs Today Current Affairs news Current Affairs PDF Current Affairs of India Today Current Affairs PDF Daily current affairs Latest GK&CA
Mounikadesk

భారత విద్యా రంగంలో కొత్త రికార్డు: ఉపాధ్యాయుల సంఖ్య మొదటిసారిగా-1 కోటికి దాటింది - UDISE+ 2024-25 నివేదిక వెల్లడి……

భారతదేశంలో విద్యా రంగం పురోగతిని వివరిస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) 2024-25 నివేదికలో దేశంలో ఉపాధ్యాయుల సంఖ్య మొదటిసారిగా కోటి మార్కును దాటిందని నివేదికలో వెల్లడైంది.

ఉపాధ్యాయుల సంఖ్యలో పెరుగుదల:

ఈ నివేదిక ప్రకారం దేశంలో ఉపాధ్యాయుల సంఖ్య మొట్టమొదటిసారిగా ఒక కోటి మార్కును దాటింది.

2023-24లో 98,07,600గా ఉన్న ఈ సంఖ్య, 2024-25లో 1,01,22,420కి పెరిగింది. ఇది గత రెండేళ్లలో 6.7% పెరుగుదల.

దేశంలోని ప్రతి పాఠశాలలో సగటున ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

మొత్తం ఉపాధ్యాయులలో 54.2% మంది మహిళా ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం.

రాష్ట్రాల వారీగా ర్యాంకింగ్లు:

ఉత్తరప్రదేశ్ అత్యధిక ఉపాధ్యాయులను కలిగి ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది.

తరువాతి స్థానాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి.

తెలంగాణ 10వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉన్నాయి.

పాఠశాలలు మరియు మౌలిక సదుపాయాలు:

దేశంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గగా ప్రైవేట్ పాఠశాలల సంఖ్య పెరిగింది.

విద్యుత్ సౌకర్యం: దేశంలో 93.6% పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉంది.

తాగునీరు: 99.3% పాఠశాలల్లో సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంది.

మరుగుదొడ్లు: 97.3% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 96.2% పాఠశాలల్లో బాలుర మరుగుదొడ్లు ఉన్నాయి.

డిజిటల్ మౌలిక సదుపాయాలు:

64.7% పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయి.

63.5% పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది, ఇది గత సంవత్సరం కంటే గణనీయమైన పెరుగుదల.

విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి:

విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి (PTR): ఈ నిష్పత్తి ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉంది, ఇది అన్ని స్థాయిల్లోనూ మెరుగుపడింది.

ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు: ఈ పాఠశాలల సంఖ్య 1,10,971 నుంచి 1,04,125కు తగ్గింది.

డ్రాపౌట్ రేటు: వివిధ స్థాయిలలో డ్రాపౌట్ రేటు గణనీయంగా తగ్గింది.

ప్రిపరేటరీ: 2.3%

మిడిల్: 3.5%

సెకండరీ: 8.2%

ఈ నిష్పత్తులు జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సు చేసిన 1:30 నిష్పత్తి కంటే మెరుగ్గా ఉన్నాయి.

విద్యార్థులు లేని పాఠశాలలు: గతంలో 12,954గా ఉన్న విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్య 7,993కు తగ్గింది. అయినప్పటికీ ఈ పాఠశాలల్లో 20,817 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

ఇతర అంశాలు:

వికలాంగ విద్యార్థుల కోసం 54.9% పాఠశాలల్లో ర్యాంపులు మరియు హ్యాండ్స్ల్స్ అందుబాటులో ఉన్నాయి.

వసతి గృహాలు ఉన్న పాఠశాలల సంఖ్య 43,389 నుండి 46,517కు పెరిగింది.

షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) మరియు ఇతర వెనుకబడిన తరగతులు (OBC) విద్యార్థుల నమోదులో తగ్గుదల కనిపించింది

Comments

-Advertisement-