కాంపిటీటివ్స్ ఎగ్జామ్స్ కు చెందిన పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం..
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కాంపిటీటివ్స్ ఎగ్జామ్స్ కు చెందిన పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం..
- 24నెలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ
- కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు
- 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలను ఏర్పాటుచేస్తాం
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి: అమరావతిలో రూ.150కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేట్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధి, సెస్సు బకాయిలకు సంబంధించి ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, పల్లె సింధూర రెడ్డి, గణబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని 24నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతాం. రాష్ట్రంలో లైబ్రరీలకు సంబంధించి మౌలిక వసతులతోపాటు మ్యాను స్క్రిప్ట్ కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ అనే సంస్థకు రూ.100 కోట్ల విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాతల సహకారాన్ని కూడా తీసుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. విశాఖపట్నంలో రూ.20కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. పిల్లల్లో పఠనాసక్తి పెంచే అంశాన్ని సీరియస్ గా తీసుకొని రాబోయే ఆరునెలల్లో మార్పులు తెచ్చేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపడుతున్నాం. గ్రంథాలయాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఇందుకోసం కార్టూనిస్టులతో కూడా చర్యలు జరిపాం. మంగళగిరి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ నిర్మాణం చివరిదశలో ఉంది, ఈ లైబ్రరీని అక్టోబర్ నెలలో ప్రారంభిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీల నిర్మాణాలను చేపడతాం. ప్రస్తుతం 13 మాత్రమే జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయి, కొత్త జిల్లాల ప్రాతిపాదికన 26జిల్లా గ్రంథాలయాలను ఏర్పాటుచేస్తాం. ఇందుకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖలో ఉంది. గ్రంథాలయ సెస్సు బకాయిలకు సంబంధించి 2022-23లో 40శాతం, 2023-24లో 45శాతం, ప్రస్తుతం సంవత్సరం 52శాతం మాత్రమే వసూలయ్యాయి. పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులను సంప్రదించి బకాయిల వసూలుచేసేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రంథాలయాల్లో కాంపిటీటివ్స్ ఎగ్జామ్స్ కు సంబంధించిన అన్నిరకాల పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం. ముఖ్యమంత్రి సూచనల మేరకు డిజిటల్ లైబ్రరీలపై దృష్టి సారించాం. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను వందరోజుల్లో ఆవిష్కరిస్తాం. సభ్యుల సూచనలతో దేశానికే మోడల్ గా గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Comments
