రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎస్.కె వర్సిటీ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటుచేసాం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఎస్.కె వర్సిటీ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటుచేసాం

  • 100రోజుల్లో నివేదిక రప్పించి బాధ్యులపై చర్యలు చేపడతాం
  • యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ వందరోజుల కార్యాచరణ ప్రణాళిక
  • అసెంబ్లీలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్


అమరావతి: శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో 2019-24 నడుమ కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్ మెంట్ లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంపై ఎంక్వయిరీ కమిటీ వేస్తాం, వందరోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. 7వరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఉంది. నిన్న ఎయులో ఒక విద్యార్థి ఫిట్స్ తో చనిపోయారు, అంబులెన్స్ ఉన్నా ఆ విద్యార్థిని కాపాడుకోలేకపోయాం. దాని వెనుక ఏదో ఉందని, కావాలని కొన్ని స్టూడెంట్స్ యూనియన్లు పాఠాలు జరగకుండా అడ్డుకోవడం బాధాకరం. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది, తప్పు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ప్రభుత్వపరంగా ఎలాంటి తప్పు లేకపోయినా రాజకీయాలు చేయడం సరికాదు. ఉన్నత విద్యను కలసికట్టుగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో విద్యార్థి సంఘాలు కూడా భాగస్వాములు కావాలి. మెరుగైన విద్య, కరిక్యులమ్ పై చర్చిద్దాం. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా యూనివర్సిటీ విసిలను నియమిస్తున్నాం. ఆంధ్రా యూనివర్సిటీని టాప్ -100 వర్సిటీలో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి గారు నాకు అప్పగించారు. కొంతమంది వారి స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టించడం బాధాకరం. సమస్యలపై విద్యార్థి సంఘాలతో చర్చించి, పరిష్కరించడానికి విసి నుంచి నావరకు అందరం సిద్ధంగా ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా డిగ్రీ కళాశాలల్లో కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉంది, ఇందుకోసం సీరియస్ గా కసరత్తు చేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక కోర్టు కేసుల కారణంగా విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్ మెంట్ జరగని మాట వాస్తవం. వందరోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొని న్యాయపరమైన చిక్కులను తొలగించి, పకడ్బందీ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు.

మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ... ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా విశ్వవిద్యాలయాలకు విసిలను నియమించినందుకు లోకేష్ కు ధన్యావాదాలు. 2019-24 మధ్య వైస్ చాన్సలర్లు యూనివర్సిటీలను వైసిపి పార్టీ కార్యాలయాలుగా మార్చారు. ఎస్ కెడి వర్సిటీ మాజీ విసి రామకృష్ణారెడ్డి నాటి ముఖ్యమంత్రి అండతో కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. కోట్లరూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. వందకంప్యూటర్లు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ వాహనాలను రిజిస్ట్రార్, రెక్టార్ విహార యాత్రలకు వాడుకున్నారు. ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. మాజీ విసి కుసుమకుమారి వాటిని ర్యాటిఫై చేశారు. నిబంధనలకు విరుద్దంగా చేశారని ఆమెను సస్పెండ్ చేశారు. దీనిపై విద్యార్థిసంఘాలు కూడా కోర్టుకు వెళ్లాయి. ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ హేమచంద్రారెడ్డి వత్తిడికి తలొగ్గి 23-8-2022న రిజిస్ట్రార్ ఇంప్లీడ్ పిటిషన్ కు విరుద్దంగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లను అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియమించారు. రిజర్వేషన్ పాటించకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అన్యాయం జరిగింది. యూనివర్సిటీల్లో 2019-24 నడుమ రాజకీయ కార్యకలాపాలు నెరపిన విసిలపై చర్యలు తీసుకోవాలని ఎంఎస్ రాజు కోరారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ... ఎస్ కె యూనివర్సిటీ లో టీచింగ్ పోస్టులు 235కి గాను 40 మాత్రమే భర్తీచేశారు, 185 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2014-19 నడుమ ఎస్ కె వర్సిటీలో 4వేల పైచిలుకు అడ్మిషన్లు ఉండగా, ఇప్పుడు 800కి పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీకళాశాలల్లో 34శాతం మాత్రమే అడ్మిషన్లు ఉన్నాయి. ఎస్ కె వర్సిటీలో టైమ్ స్కేల్, మినిమమ్ స్కేల్ తో గత 25 ఏళ్లుగా 280మంది పనిచేస్తున్నారు. వారిని రెగ్యులర్ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.


Comments

-Advertisement-