తలశిల రఘురామ్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
తలశిల రఘురామ్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
- రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావుకు నివాళి
- గొల్లపూడిలో కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన జగన్
- పార్టీ నేతలు, కార్యకర్తల హాజరు
విజయవాడ, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ ఉదయం రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూయడంతో విజయవాడ గొల్లపూడిలోని ఆయన నివాసానికి జగన్ వెళ్లారు. చంద్రశేఖరరావు భౌతికకాయానికి జగన్ నివాళి అర్పించారు. అనంతరం రఘురామ్ కుటుంబ సభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేశ్, నేత దేవినేని అవినాశ్, విడదల రజనితో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని రఘురామ్ కుటుంబానికి తమ సానుభూతి తెలిపారు. ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
Comments
