ఇరాన్ నాయకుడు మొజ్తబా ఖమేనీ గాయాలపై అనుమానాలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఇరాన్ నాయకుడు మొజ్తబా ఖమేనీ గాయాలపై అనుమానాలు
- అమెరికా–ఇజ్రాయెల్ దాడిలో గాయపడ్డారన్న సమాచారం
- అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అమెరికా వ్యాఖ్యలు
- రాతపూర్వక ప్రకటనపై సందేహాలు
వాషింగ్టన్, 13 మార్చి (పీపుల్స్ మోటివేషన్) : ఇరాన్ తాజా నాయకుడు మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఈ దాడుల తర్వాత మొజ్తబా ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు అమెరికా భావిస్తున్నట్లు తెలిపారు. అమెరికా–ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రస్తుతం పద్నాలుగో రోజుకు చేరుకుంది. యుద్ధం మొదటి రోజునే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా ఖమేనీ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం మొజ్తబా ఖమేనీని దేశ అత్యున్నత నాయకుడిగా ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాడిలో మొజ్తబా ఖమేనీ కోమాలోకి వెళ్లిపోయారని, ఆయన ఒక కాలును కోల్పోయినట్లు కూడా సమాచారం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల మొజ్తబా ఖమేనీ పేరిట ఒక ప్రకటన విడుదలైనప్పటికీ అందులో ఆయన స్వరమో, వీడియో సందేశమో లేదని అమెరికా రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేవలం రాతపూర్వక ప్రకటన మాత్రమే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇరాన్ వద్ద అత్యాధునిక సాంకేతిక వనరులు ఉన్నప్పటికీ వీడియో లేదా స్వర సందేశం ఇవ్వకపోవడం వెనుక కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
Comments
