రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గద్దర్ అవార్డు విజేతలకు నాగార్జున అభినందనలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గద్దర్ అవార్డు విజేతలకు నాగార్జున అభినందనలు

హైదరాబాద్‌, మార్చి 7 (పీపుల్స్ మోటివేషన్):

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డు విజేతలందరికీ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత ఏడాది సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను పరిశీలించిన జ్యూరీ ‘తండేల్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అక్కినేని నాగచైతన్యను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య కెరీర్‌లో ఇది రెండో రాష్ట్ర స్థాయి అవార్డు కావడం విశేషంగా నిలిచింది. గతంలో ‘మనం’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి తొలి గద్దర్ అవార్డును అందుకోబోతున్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా నాగచైతన్యకు అభినందనలు తెలుపుతూ నాగార్జున సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. 2025 గద్దర్ అవార్డు విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన కుమారుడు సాధించిన విజయంపై గర్వంగా ఉందని పేర్కొన్నారు. “దుమ్ములేపావు నాన్న.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడు కష్టపడి సాధించిన విజయానికి తగిన గుర్తింపు దక్కిందని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో తన తండ్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు పేరు మీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రారంభించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు నిజంగా అక్కినేని నాగేశ్వరరావుకు తగిన గౌరవమని పేర్కొంటూ, ఈసారి ఆ అవార్డు అందుకున్న ప్రముఖ నటి జయసుధకు కూడా అభినందనలు తెలిపారు.

Comments

-Advertisement-