మదనపల్లె దస్త్రాల దహనం కేసు…
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మదనపల్లె దస్త్రాల దహనం కేసు…
- కీలక నిందితులకు రిమాండ్
- సీఐడీ విచారణ వేగవంతం
- టోల్ప్లాజా వద్ద నిందితుల అరెస్ట్
- ఏప్రిల్ 1 వరకు న్యాయస్థానం రిమాండ్
మదనపల్లె, మార్చి 19 (పీపుల్స్ మోటివేషన్): మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో భూములకు సంబంధించిన కీలక దస్త్రాల దహనం కేసులో సీఐడీ విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ మునితుకారాం, ఆయన అనుచరుడు మాధవరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఈ ఇద్దరినీ సీఐడీ అధికారులు గాదంకి టోల్ప్లాజా వద్ద చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారించి ఈరోజు ప్రత్యేక సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచగా, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు.
నిందితులకు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా మరింత లోతైన దర్యాప్తు కొనసాగనున్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. భూముల దస్త్రాల దహనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సమాచారం.
Comments
