రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం వ్యాఖ్యలు అబద్ధం: హరీశ్ రావు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం వ్యాఖ్యలు అబద్ధం: హరీశ్ రావు

- వరద కాలువలో ప్రవహిస్తున్న నీళ్లపై ప్రశ్నలు

- గాయత్రి పంప్ హౌస్ మోటార్లు నడుస్తున్నాయన్న మాజీ మంత్రి

- ప్రాజెక్టుపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని విమర్శ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్న వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. హరీశ్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం వరద కాలువలో పారుతున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినవే కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనిచేయకపోతే ఈ నీరు ఎలా వస్తుందని ఆయన నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్ మోటార్లు నడుస్తున్నందువల్లే ఈ నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. ప్రాజెక్టు పనితీరును ప్రజల ముందు తప్పుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కీలకమైన సాగునీటి వనరుగా నిలుస్తోందని ఆయన అన్నారు. ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు చేయకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని హరీశ్ రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందుతోందని ఆయన పేర్కొన్నారు.

Comments

-Advertisement-