రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అంతరించిపోయే జీవజాతులకు ఆవాస కేంద్రంగా చిత్తడి నేలలు

Which is India's latest Ramsar site? Which is the smallest Ramsar site in India? Which is the largest Ramsar site in India? Which is the first Rams
Peoples Motivation

అంతరించిపోయే జీవజాతులకు ఆవాస కేంద్రంగా చిత్తడి నేలలు 


 75 నుంచి 80కి పెరిగిన రామ్‌సర్‌ సైట్స్.

 కర్ణాటక లో 3, తమిళనాడు లో 2.

 దేశంలో అత్యధికంగా తమిళనాడులో 16 రామ్‌సర్‌ సైట్స్




పర్యావరణ పరిరక్షణలో భారత్‌ మరో ముందడుగు దేశంలో 5 కొత్త చిత్తడి ప్రాంతాలను రామ్‌సర్‌ సైట్లుగా గుర్తించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో దేశంలో గుర్తింపు పొందిన మొత్తం రామ్‌సర్‌ సైట్ల జాబితా 80కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తడి నేలల ఆవశ్యకత గురించి సమగ్రంగా తెలుసుకుందాం.

చిత్తడి నేల అంటే? ఏమిటి?

wetlands


సంవత్సరం పొడవునా నీటితో నిండి ఉండే ప్రాంతాలను చిత్తడి ప్రాంతాలు అంటారు.
 ఉదాహరణకు: మంచినీటి, ఉప్పునీటి సరస్సులు. మడ అడవులను కలిగిన సాగర సంగమ ప్రాంతాలు, బురద కయ్యలు, ఉప్పునీటి కయ్యలు, రొయ్యల చెరువులు. వరి పొలాలు, పగడపు దిబ్బలు, ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు, నదీముఖ, సముద్ర తీర ప్రాంతాలు. ఇలా 19 రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందికి వస్తాయి.

చిత్తడి నేలల పరిరక్షణకు అంతర్జాతీయ కృషి, రామ్‌సర్‌ ఒప్పందం-1971


అంతర్జాతీయంగా చిత్తడి నేలలను పరిరక్షించడానికి 1960 దశకం నుంచే ప్రయత్నాలు జరిగాయి. చివరగా యునెస్కో ఆధ్వర్యంలో 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని రామ్‌సర్‌ అనే నగరంలో అంతర్జాతీయ చిత్తడినేలల పరిరక్షణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో 18 దేశాలు తీర్మానం మీద సంతకాలు చేశాయి.

1) రామ్‌సర్‌ ఒప్పందం మీద సంతకం చేసిన తొలి దేశం- ఆస్ట్రేలియా (1974లో)
2) రామ్‌సర్‌ ఒప్పందం కింద గుర్తించిన తొలి సైట్‌- కోబర్గ్ ద్వీపకల్పం (ఆస్ట్రేలియా)
3) యునెస్కో ఆధ్వర్యంలో రామ్‌సర్‌ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంవత్సరం- 1975


నోట్‌: అంతర్జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ తొలి సదస్సు జరిగిన ఫిబ్రవరి 2ను 1997 నుంచి ప్రతి ఏటా ‘ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినం-2024 ఇతివృత్తం "చిత్తడి నేలలు మరియు మానవ శ్రేయస్సు'’.

భారత్‌ రామ్‌సర్‌ ఒప్పందంలో చేరిన రోజు- 1982, ఫిబ్రవరి 01.


రామ్‌సర్‌ కన్వెన్షన్‌లో భాగస్వాములుగా ఉన్న అంతర్జాతీయ సంస్థలు


1) బర్డ్ లైప్‌ ఇంటర్నేషనల్‌
2) ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌)
3) వెట్‌ల్యాండ్స్‍ ఇంటర్నేషనల్‌
4) వరల్డ్‍ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)
5) అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ
6) వైల్డ్‍ ఫౌల్‌ అండ్‌ వెట్‌ల్యాండ్స్‍ ట్రస్ట్

1982 పారిస్ ప్రొటోకాల్‌, 1987 రెజినా ప్రొటోకాల్స్‍ ద్వారా రామ్‌సర్‌ ఒప్పందం కొన్ని మార్పులకు గురైంది.

 రామ్‌సర్‌ ఒప్పందం – మూడు కీలక స్తంభాలు


1) చిత్తడి ప్రాంతాల తెలివైన వినియోగం
2) అంతర్జాతీయ కృషి కోసం అర్హత కలిగిన చిత్తడి ప్రాంతాలను రామ్‌సర్‌ సైట్లుగా గుర్తించడం
3) అంతర్జాతీయంగా చిత్తడి ప్రాంతాల పరిరక్షణకు సమష్టి కృషి చేయడం

నోట్‌: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రామ్‌సర్‌ ఒప్పందంలోని దేశాలు- 172

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్‌సర్‌ సైట్లు- 2400 పైగా

 అత్యధికంగా రామ్‌సర్‌ సైట్లు ఉన్న దేశాలు- యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (175) మొదటి స్థానంలో, మెక్సికో (142) రెండో స్థానంలో ఉన్నాయి.

-రామ్‌సర్‌ సైట్ల కింద అత్యధిక సంరక్షణ ప్రాంతంలోని దేశం- బొలీవియా (1,48,000 చ.కి.మీ.)

– ప్రపంచంలో అతిపెద్ద రామ్‌సర్‌ సైట్‌ (విస్తీర్ణం పరంగా) గల దేశం- బ్రెజిల్‌ (రియో నీగ్రో రామ్‌సర్‌ సైట్‌ 1,20,000 చ.కి.మీ.)

 మాంట్రియక్స్ రికార్డ్ అంటే?


అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల జాబితాలోని వాటిలో పర్యావరణ మార్పుల వల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలకు గురయ్యే రామ్‌సర్‌ సైట్ల గురించి తెలియజేసే జాబితాను మాంట్రియక్స్ రికార్డ్స్ అని అంటారు.

1990లో మాంట్రియక్స్ రికార్డ్స్ ను రూపొందించారు.

ఇది రామ్‌సర్‌ ఒప్పందంలో ఒక అంతర్భాగం.

ప్రస్తుతం మాంట్రియక్స్ రికార్డ్స్ లో 48 రామ్‌సర్‌ సైట్లను గుర్తించారు.

 గమనిక: మాంట్రియక్స్‍ రికార్డ్ లో చేర్చిన భారతదేశానికి చెందిన రామ్‌సర్‌ సైట్లు- 2 (మణిపూర్‌లోని లోక్‌తక్‌ సరస్సు, రాజస్థాన్‌లోని కియోలాడియో జాతీయ పార్క్ )

 రామ్‌సర్‌ సైట్లు (చిత్తడి నేలలు)– భారత్‌

👉 దేశంలో గుర్తించిన తొలి రామ్‌సర్‌ సైట్స్- చిలికా సరస్సు (ఒడిశా), కియోలాడియా జాతీయ పార్క్ (రాజస్థాన్‌)

👉 దేశంలో అత్యధిక రామ్‌సర్‌ సైట్లు గల రాష్ట్రం- తమిళనాడు (16)

👉 దేశంలో అతిపెద్ద రామ్‌సర్‌ సైట్‌- సుందర్బన్స్ మడ అడవులు (పశ్చిమ బెంగాల్‌)

👉దేశంలో అతిచిన్న రామ్‌సర్‌ సైట్‌- రేణుక వెట్‌ల్యాండ్‌ (0.2 చ.కి.మీ.), హిమాచల్‌ ప్రదేశ్‌


 చిత్తడి ప్రాంతాలు – పర్యావరణ ప్రాముఖ్యత


👉 నదీ తీరాల్లోని చిత్తడి నేలలు ప్రవాహ ఉధృతిని, అలల తాకిడిని అడ్డుకొని తుపానులు, వరదల ప్రభావాన్ని తగ్గిస్తాయి.

👉 అరుదైన మత్స్య వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతో పాటు దేశ విదేశీ వలస పక్షులకు ఆశ్రయమిస్తాయి.

👉 ఈ నేలలు పరిసర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాక, కాలుష్య తీవ్రతను తగ్గించడంలోనూ తోడ్పడుతాయి.

👉 వృక్ష, జంతు సంపద, జలచర జీవులకు చిత్తడి ప్రాంతాలు ఆవాసాలు

👉 వాతావరణంలో తేమ శాతాన్ని కొనసాగించడానికి దోహదపడతాయి.

👉 వరి వంటి పంటలకు జన్యు రిజర్వ్ గా పనిచేస్తాయి.

👉 పర్యాటక రంగం బలోపేతం కావడానికి తద్వారా ఆర్థిక ప్రగతికి కారణమవుతాయి.

👉 సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మికతకు ఇవి నెలవులుగా ఉంటున్నాయి.

👉 ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ కొద్ది ప్రజలకు ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి.

👉 జీవవైవిధ్యం అంతరించడకుండా ఉండటానికి ప్రధాన సహజ వనరులుగా ఉన్నాయి.

 చిత్తడి నేలల క్షీణతకు – ప్రధాన కారణాలు


ఆక్వా కల్చర్‌, ఓవర్‌ ఫిషింగ్‌,
పారిశ్రామిక, గృహ, వ్యవసాయ వ్యర్థాలు యథేచ్ఛగా చిత్తడి ప్రాంతాల్లో కలిసి పోతుండటం,
అటవీ నిర్మూలన, ప్రజా ఆవాసాల కోసం చిత్తడి ప్రాంతాల ఆక్రమణ,
వరి బదులు వాణిజ్య పంటలను సాగుచేయడం,
సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఇసుక తవ్వకాలు జరపడం.

 చిత్తడి నేలల సంరక్షణ – భారత ప్రభుత్వ చర్యలు


1) 1985-86 నుంచి జాతీయ చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడం

2) చిత్తడి నేలలు పరిరక్షణ, నిర్వహణ నియమాలు-2017ను అమలు చేయడం

3) చిత్తడి నేలలను రామ్‌సర్‌ సైట్స్ గా గుర్తింపు పొందడానికి అంతర్జాతీయంగా కృషిచేయడం

 గమనిక: చిత్తడి నేలల నిబంధనలు-2017 ప్రకారం ఈ కింది వాటిని భారత ప్రభుత్వం నియంత్రించడం లేదు.

1. నదీ కాలువలు

2. వరి పొలాలు

3. తాగునీటి అవసరాల కోసం, ఆక్వా కల్చర్‌ కోసం నిర్మించిన కాలువలు, నీటి వనరులు

4. ఇండియన్‌ ఫారెస్ట్ యాక్ట్-1927 పరిధిలోకి వచ్చే చిత్తడి నేలలు

5. అటవీ పరిరక్షణ చట్టం-1980 పరిధిలోకి వచ్చే ప్రాంతాలు

6. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 పరిధిలోకి వచ్చే చిత్తడి నేలలు

7. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నోటిఫికేషన్‌-2011 పరిధిలోకి వచ్చే చిత్తడి నేలలు

కొత్తగా చేర్చిన చిత్తడి నేలల వివరాలు


1). అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్-(కర్ణాటక)


అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది శతాబ్దాల క్రితం నిర్మించిన మానవ నిర్మిత గ్రామ నీటిపారుదల ట్యాంక్ మరియు అంకసముద్రం గ్రామానికి ఆనుకుని 98.76 హెక్టార్ల (244.04 ఎకరాలు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది 210 రకాల మొక్కలు, 8 రకాల క్షీరదాలు, 25 రకాల సరీసృపాలు, 240 జాతుల పక్షులు, 41 జాతుల చేపలు, 3 జాతుల కప్పలు, 27 జాతుల సీతాకోకచిలుకలు మరియు 32 జాతులతో కూడిన జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉన్న పర్యావరణపరంగా ముఖ్యమైన చిత్తడి నేల.

2). అఘనాశిని ముఖద్వారం    -(కర్ణాటక)


4801 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అఘనాశిని నది అరేబియా సముద్రంలో అఘనాశిని నది సంగమం వద్ద ఏర్పడింది. నది ముఖద్వారం యొక్క ఉప్పునీరు వరద మరియు కోత ప్రమాదాన్ని తగ్గించడం, జీవవైవిధ్య పరిరక్షణ మరియు జీవనోపాధి మద్దతుతో సహా విభిన్న పర్యావరణ వ్యవస్థ సేవలను అందిస్తుంది. ఈ చిత్తడి నేల చేపలు పట్టడం, వ్యవసాయం, తినదగిన బివాల్వ్‌లు మరియు పీతల సేకరణ, రొయ్యల ఆక్వాకల్చర్, ఈస్టూరైన్ వరి పొలాలలో సాంప్రదాయ చేపల పెంపకం (స్థానికంగా గజ్ని వరి పొలాలు) బివాల్వ్ షెల్ సేకరణ మరియు ఉప్పు ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం ద్వారా 6000-7500 కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తుంది. అదనంగా, నదీ ముఖద్వారం సరిహద్దులో ఉన్న మడ అడవులు తుఫానులు మరియు తుఫానుల నుండి తీరాలను రక్షించడంలో సహాయపడతాయి. నదీ ముఖద్వారం క్రమం తప్పకుండా 66 కంటే ఎక్కువ వాటర్‌బర్డ్ జాతుల 43,000 గణనలకు మద్దతు ఇస్తుంది మరియు 15 వాటర్‌బర్డ్ జాతుల (ఇందులో రివర్ టెర్న్, ఓరియంటల్ డార్టర్, లెస్సర్ బ్లాక్-బ్యాక్డ్ గల్, ఉన్ని-నెక్డ్ కొంగ, యురేషియన్ ఓస్టెర్‌క్యాచర్ మరియు ఇతరాలు ఉన్నాయి) జీవ భౌగోళిక జనాభాలో 1% కంటే ఎక్కువ.

3). మగాడి కెరె కన్జర్వేషన్ రిజర్వ్-(కర్ణాటక)


దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో మానవ నిర్మిత చిత్తడి నేల, ఇది నీటిపారుదల ప్రయోజనాల కోసం వర్షపు నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడింది. ఇది 166 రకాల పక్షులకు నిలయం, వాటిలో 130 వలస పక్షులు. చిత్తడి నేలలో రెండు హాని కలిగించే జాతులు ఉన్నాయి, అవి కామన్ పోచార్డ్ ( అయిత్యా ఫెరినా ) మరియు రివర్ టెర్న్ ( స్టెర్నా ఔరాంటియా ) మరియు ఓరియంటల్ డార్టర్ ( అన్‌హింగా మెలనోగాస్టర్ ), బ్లాక్-హెడెడ్ ఐబిస్ ( థ్రెస్కియోర్నిస్ మెలనోసెఫాలస్ ) (స్టోరోల్‌క్లీ-నెక్డ్) అనే నాలుగు ప్రమాదకర జాతులు. సికోనియా ఎపిస్కోపస్ ) మరియు పెయింటెడ్ కొంగ ( మైక్టీరియా ల్యూకోసెఫాలా ). శీతాకాలంలో దాదాపు 8,000 పక్షులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తాయి. మగాడి కెరె దక్షిణ భారతదేశంలో బార్-హెడెడ్ గూస్ ( అన్సర్ ఇండికస్ ) కోసం అతిపెద్ద శీతాకాలపు మైదానాలలో ఒకటి . చిత్తడి నేలను నియమించబడిన ముఖ్యమైన పక్షుల ప్రాంతం మరియు భారతదేశంలో పరిరక్షణకు ప్రాధాన్యతా ప్రాంతంగా కూడా జాబితా చేయబడింది.

4). కరైవెట్టి పక్షుల అభయారణ్యం    -(తమిళనాడు)


తమిళనాడులోని అతిపెద్ద లోతట్టు చిత్తడి నేలలలో ఇదోకటి మరియు ఈ ప్రాంతానికి భూగర్భజలాల పునరుద్ధరణకు ముఖ్యమైన వనరు. చిత్తడి నేల నుండి వచ్చే నీటిని గ్రామస్తులు వరి, చెరకు, పత్తి, మొక్కజొన్న మరియు చీలిక ఎర్రజొన్న వంటి వ్యవసాయ పంటల సాగుకు ఉపయోగిస్తారు. కరైవెట్టిలో తమిళనాడు రాష్ట్రంలో నీటి పక్షులు ఎక్కువగా ఉండే సమూహాలలో ఒకటి. దాదాపు 198 రకాల పక్షులు ఇక్కడ నమోదు చేయబడ్డాయి; బార్ హెడ్డ్ గూస్, పిన్-టెయిల్డ్ డక్, గార్గేనీ, నార్తర్న్ షావెలర్, కామన్ పోచార్డ్, యురేషియన్ విజియన్, కామన్ టీల్ మరియు కాటన్ టీల్ వంటి కొన్ని ముఖ్యమైనవి.

5). లాంగ్‌వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్-(తమిళనాడు)


తమిళ పదం "సోలై" నుండి దాని పేరు వచ్చింది, దీని అర్థం 'ఉష్ణమండల వర్షారణ్యం'. తమిళనాడులోని నీలగిరి, అనమలై, పల్ని కొండలు, కలకాడు, ముందంతురై మరియు కన్యాకుమారి ఎగువ ప్రాంతాలలో 'షోళాలు' కనిపిస్తాయి. ఈ అటవీ చిత్తడి నేలలు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న బ్లాక్-చిన్డ్ నీలగిరి లాఫింగ్ థ్రష్ ( స్ట్రోఫోసిన్‌క్లా కాచిన్నన్స్ ), నీలగిరి బ్లూ రాబిన్ ( మైయోమెలా మేజర్ ) మరియు హాని కలిగించే నీలగిరి వుడ్-పావురం ( కొలంబా ఎల్ఫిన్‌స్టోని ) లకు ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి . పశ్చిమ కనుమలలోని 26 స్థానిక పక్షి జాతులలో 14 ఈ చిత్తడి నేలల్లో కనిపిస్తాయి.

Comments
User
Comment Poster
News paper supar bro

-Advertisement-