రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ప్రయాణం వాయిదా వేసుకోండి..

Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines Braking news Popular news Telugu
Peoples Motivation

సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ప్రయాణం వాయిదా వేసుకోండి..

చలమ రేంజిలో చిరుత పులులు ఎలుగు బంటిల సంచారం..

-రేంజ్ అధికారి ఈశ్వరయ్య

నంద్యాల/రుద్రవరం, మే 10 (పీపుల్స్ మోటివేషన్):-

చలమ రేంజి లో ఉన్న నంద్యాల, గిద్దలూరు ప్రధాన రహదారిలో ఉన్న అభయారణ్యంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని చలమరేంజ్ అధికారి ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నాగర్జున శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులుల అభయరన్యం నంద్యాల గిద్దలూరు రహదారిలో అంకిరెడ్డి చెరువు నుండి ప్రకాశం జిల్లా సరిహద్దు వరకు చలమ రేంజ్ పరిధిలో చిరుతపులులు మరియు ఎలుగుబంటి ల సంచారం ఎక్కువగా ఉందన్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులపై చిరుత పులులు, ఎలుగుబంటి లు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. కావున ఈ రహదారిలో ప్రయాణం చేసే వాహనదారులు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా కోరారు.

Comments

-Advertisement-