రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

AP GOVT: 30 జిల్లాల ఏర్పాటులో వాస్తవం లేదు.. మద్యం టెండర్ల లో పార్టీ నేతలు జోక్యం చేసుకోవద్దు- సీఎం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

AP GOVT: 30 జిల్లాల ఏర్పాటులో వాస్తవం లేదు.. మద్యం టెండర్ల లో పార్టీ నేతలు జోక్యం చేసుకోవద్దు- సీఎం 

• వన్ నేషన్...వన్ ఎలక్షన్ విధానాన్ని బలపరుస్తాం.

• పార్లమెంట్, శాసనసభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు

• మోడీ నాయకత్వాన్ని దేశం హర్షిస్తోందనడానికి హర్యానా ఫలితాలే నిదర్శనం

• ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు మద్ధతుగా నిలుస్తున్నారు

• మోడీ హవా తగ్గిందనే తప్పుడు ప్రచారం జమ్మూ, హర్యానా ఎన్నికల ఫలితాలతో కొట్టుకుపోయింది

• 2047 నాటికి దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటుంది

• రెండు రోజుల ఢిల్లీ పర్యటన సత్ఫలితాలను ఇచ్చింది

• వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇవ్వాలని ప్రధాని, కేంద్ర మంత్రులను కోరా

• రాష్ట్రంలో వరద సాయంపై సిగ్గులేకుండా వైసీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు

-మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news


వన్ నేషన్-వన్ ఎలక్షన్ ను బలపరుస్తాం...

వన్ నేషన్... వన్ ఎలక్షన్ అనే మోదీ ఆలోచనను బలపరుస్తాం. పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. నరేంద్రమోదీ సారధ్యంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం, హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపొందాయి. 

హర్యానా ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది..

హర్యానా ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని బీజేపీ సాధించింది. బీజేపీ నేతలు సమిష్టిగా పనిచేసిన విధానం, అగ్ర నాయకత్వం పనిచేయడంతో మంచి విజయం సాధించారు. మంచి పనులు చేస్తే ఏ విధంగా మెజారిటీ పెరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. హర్యానాలో 90 సీట్లలో 48 సీట్లు గెలిచి 39.94 శాతం ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో 36.4 శాతం ఓట్లు వచ్చాయి. గతం కంటే 3.54 శాతం ఓట్లు పెరిగాయి. 

ఒక వ్యక్తిపైన నమ్మకం, ఒక పార్టీ చేపట్టిన సుపరిపాలన...రోజురోజుకు ఓట్ల శాతం పెరిగే పరిస్థితి వస్తోంది. సుస్థిరత, సంక్షేమానికి హర్యానా ప్రజలు ఓటేశారు. రాబోయే జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ మంచి ఫలితాలే వస్తాయి. వన్ నేషన్ , వన్ ఎలక్షన్ అనేది ఎన్డీఏ విధానం. ప్రతి ఆరు నెలలు, సంవత్సరానికి కాకుండా స్థానిక సంస్థలు సహా అన్నింటికీ ఒకే సారి ఎన్నికలు జరగాలి. ఆపై పాలనపై ఐదేళ్లు దృష్టి పెట్టాలి. ఎప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇబ్బందులే. నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలబడబోతోంది. త్వరలో ప్రపంపంచలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ తయారవుతుంది. 

వికసిత్ భారత్ -2047తో భారత్  మొదటి లేదా రెండో అతిపెద్ద వ్యవస్థ దేశంగా తయారవుతుంది. టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వరకూ వెళ్లింది. యువత మన దేశానికి కలిసొచ్చే అంశం. మనకు స్వాతంత్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు అవుతుంది. మనదేశం ప్రతిష్ట మరింత పెరుగుతుంది.’ అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఉండవల్లి నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడారు.  

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర పెద్దలతో చర్చలు..

‘రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను కలిశాను. గత పాలకుల చేతిలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి కేంద్ర సాయం అవసరం...ఇదే మాటను ఎన్నికల సమయంలో చెప్పాను. ఒక విధ్వంసకర వ్యక్తి చేతికి అధికారం వస్తే రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అవుతుందో ఏపీ ఒక కేస్ స్టడీ. భావితరాలకు కూడా ఇదొక ఉదాహరణగా ఉంటుంది.  సమైక్యాంధ్రప్రదేశ్ లో మనం చేసిన పనుల వల్ల తెలంగాణ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఒక విధ్వంస పాలన వల్లే మనం ఎక్కువ నష్టపోయాం. ఎవరికి ఓటు వేస్తే సుస్థిరమైన పాలన వస్తుందో ప్రజలు ఆలోచన చేయాలి. విజన్ తో సంస్కరణలు తేవొచ్చు. సంక్షేమం, అభివృద్ధి సమంగా తీసుకెళ్లాలి. మోదీ మూడోసారి గెలవడమే కాకుండా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెడితే మరింత మెరుగైన అవకాశాలు వస్తాయి. వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కింద 6 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. మౌలిక సదుపాయాల కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, రహదారుల నిర్మాణాలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాయి. ఒక్క రైల్వే రంగంలోనే ఏపీలో రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఉత్తర భారత దేశంలో అహ్మదాబాద్ టూ ముంబాయ్ బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. దక్షిణ భారతదేశంలో పెడితే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ బుల్లెట్ ట్రైన్ వస్తే 4 కోట్ల మందికి ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామీణ రహదారుల కోసం కూడా రూ.62,500 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. 3 కోట్ల మందికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టిస్తున్నారు. కుసుమ్ కింద రైతులకు నేరుగా సోలార్ ఎనర్జీ ఇవ్వడం, ఇళ్లకూ ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మేము అలయన్స్ పెట్టుకుంది రాష్ట్ర అవసరాల కోసమే కాకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉంది. 24 గంటలూ ప్రజలకు ఏం చేయాలనేదే ప్రధాని ఆలోచిస్తుంటారు. మెరుగైన అధునాతన టెక్నాలజీని కేంద్రం వినియోగిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా అందరి ప్రొఫైల్స్ రికార్డు మెయింటైన్ చేస్తే దేశవ్యాప్తంగా అందరి ఆరోగ్యాలపై ఒక స్పష్టత వస్తుంది. ఎక్కడ, ఎవరు ఏ వ్యాధితో ఎక్కువ ఉన్నారో తెలుసుకోవచ్చు. అలాగే అపార్ ద్వారా ఒకటో తరగతి పిల్లాడు కాలేజీ నుంచి బయటకు వచ్చే నాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి...ఏం స్కిల్స్ ఇవ్వాలనే దానిపై స్పష్టత వస్తుంది. గెలుపునకు విశ్లేషణ చేయాలి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగిందంటే వారి కార్యక్రమాలకు ప్రజామోదం ఉన్నట్టే. ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది, తర్వాత ఎలక్ట్రానికి మీడియా...ఆపై సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు అందరూ రాసేవాళ్లే. రాజకీయ పార్టీలు వందల ఛానల్స్ పెట్టేస్తున్నాయి. ఒక వార్త నిజమా కాదా అని తెలుసుకునే లోపే బయటకు వదిలేస్తున్నారు.’ అని అన్నారు.  


వరద సాయంపై సిగ్గులేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారు..

‘విజయవాడలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. 10 రోజులు బురదలోనే ఉన్నాము. ప్రజల కోసం పనిచేశాం. ప్రతిపక్షం ఎక్కడైనా కనిపించిందా? బుడమేరుకు గండ్లు పెట్టి వరద తెచ్చారు. ప్రకాశం బ్యారేజ్ కు బోట్లు పంపి ధ్వంసం చేయాలని చూశారు. సిగ్గులేకుండా ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అగ్గిపెట్టెలు, భోజనాలు అని మాట్లాడుతున్నారు. విపత్తుల్లో కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే పట్టుకుని వేలాడుతున్నారు. చేతనైతే సాయం చేయాలి కానీ ఇలా బురద జల్లుతారా? ఇలాంటి వారిని ప్రజలు నేతలుగా గుర్తించరు. రూ.450 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి వచ్చాయి. ఇదో చరిత్ర. నా రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం రావడం ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఒక్కరూ తోచిన సాయం చేశారు.’ అని అన్నారు.  

జోన్ ఏర్పాటుకు భూమి కేటాయింపుపై గత పాలకులు నోరు మెదపలేదు..

‘తిరుమల బ్రహ్మోత్సవాలు, బెజవాడ దుర్గమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఇలా జరిగాయా? వాళ్లు కల్తీ మనుషులు. గుజరాత్ లో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోంది. నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశాను. ఏపీకి సంబంధించి రైల్వే జోన్ మాత్రమే కాకుండా 90 వరకూ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. నమో భారత్ ప్రవేశపెడితే విశాఖ-విజయవాడ, విజయవాడ-తిరుపతి రైళ్లు నడపొచ్చు. రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీతో చర్చించాము. ఇప్పటికే రాష్ట్రంలో రూ.55 వేల కోట్ల విలువ చేసే పనులను రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పారు. విశాఖలో భోగాపురం, మూలపాడు, కుప్పం నుంచి బెంగుళూరుకు రహదారులు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై రిపోర్టులు ఇచ్చాము. కేంద్రమంత్రి కుమారస్వామితో వ్యక్తిగతంగా మాట్లాడా. కేంద్ర ఆర్థిక మంత్రితోనూ మాట్లాడాము. మళ్లీ ఈ నెల చివరి వారం, లేదా వచ్చే నెల మొదటి వారం మరోసారి కేంద్రమంత్రులను కలుస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఢిల్లీ పర్యటనలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. కొందరి వల్ల ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎలా అధిగమించాలో చర్చించాం. ఐదేళ్లు అధికారం ఇస్తే ఒక్క ప్రాజెక్టు ప్రారంభించలేదు. విశాఖలో  జోన్ ఏర్పాటుకు భూమి కేటాయించాలని అడిగితే నోరు మెదపకపోవడం దురదృష్టకరం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాం. వాజ్ పేయి హయాంలో డబ్బులు ఇప్పించి ఈక్విటీతో ముందుకెళ్లాం. ఇటీవల రూ.1650 కోట్లలో రూ.500 కోట్లు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం సర్వ శక్తులొడ్డి పోరాడుతున్నాం. తీర ప్రాంతంలో 20 వేల ఎకరాల సాల్ట్ ల్యాండ్స్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో 50 శాతం ఇవ్వాలన్నారు...ఉచితంగా ఇవ్వాలని అడిగితే ఆలోచిస్తామన్నారు. బీపీసీఎల్  రిఫైనరీని మూలపాడు, భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులను పరిశీలించి ఏర్పాటు చేయాలని ఛైర్మన్ ను కోరతాం. రాయితీలు కూడా ఇవ్వాలని అమిత్ షాతో మాట్లాడాను. గ్రేహౌండ్ శిక్షణా కేంద్రానికి సాయం కోరాం’ అని అన్నారు.  

మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో పార్టీ నేతలు జోక్యం చేసుకోవద్దు..

మద్యం టెండర్లలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించనన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు మద్యం టెండర్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదని ప్రజలకు మంచి చేయడానికే పొలిటికల్ గవర్నెన్స్ ఉపయోగించుకోవాలన్నారు. వర్షాలు, వరదల వల్లే ఇసుక తవ్వకాలు నిలిచిపోయి కొంత ఇబ్బంది ఎదురైందని రాత్రిపూట తవ్వకాలు జరపకూడదన్న ఎన్జీటీ నిబంధనలు కూడా అడ్డంకిగా మారాయని చంద్రబాబు వెల్లడించారు.

30 జిల్లాల ఏర్పాటులో వాస్తవం లేదు..

వీలైనంత తక్కువ ధరకు ఇసుక సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారులతో కొన్ని తప్పులు చేయించిందని ఇప్పుడు వారందరినీ పక్కనపెట్టడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో అధికారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇప్పుడు వీళ్లను కూడా పక్కన పెట్టేస్తే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉండదన్నారు. 30 జిల్లాల ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పొలిటికల్ గవర్నన్స్ అంటే అన్నింట్లోనూ తలదూర్చటం కాదని స్పష్టం చేశారు. 

అసభ్యతకు వైసీపీ మారుపేరు..

‘ఏపీకి ఆక్సిజన్ అందించాలని కోరా. రూ.10.50 లక్షల కోట్ల అప్పులను గత పాలకులు చేశారు. మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఆదాయ వనరులను పూర్తిగా నిర్వీర్యం చేశారు. గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం. ఇళ్ల మీద దాడిచేసినా, ఆఫీసుల మీద దాడులు చేసినా కేసులు పెట్టకూడదా...రాష్ట్రానికి వీరే అరిష్టం. అసభ్యతకు మారుపేరుగా వైసీపీ తయారైంది. నేరాలు ఘోరాలు చేయడం, బూతులు మాట్లాడటం వైసీపీ పేటెంట్ హక్కుగా మారింది. విమర్శలు ప్రజాహితం కోసం ఉండాలి. కొందరు ఎందుకు విమర్శిస్తారో తెలీదు. ఏది మాట్లాడినా ప్రజలు ఆమోదిస్తారనే అహంభావంతో ఉన్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారు కూడా. దేనికైనా హద్దులుంటాయి. సామాజిక మాద్యమాల్లో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ప్రాంతీయ పార్టీలకు టీడీపీ తల్లి లాంటిది. నాడు నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎన్టీఆర్ 35 పార్టీలను తీసుకొచ్చి సభలు పెట్టారు’ అని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

Comments

-Advertisement-