రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

లంచం తీసుకుంటుండగా 'ఏసీబీ రైడ్'లో చిక్కిన మున్సిపల్ కమిషనర్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

లంచం తీసుకుంటుండగా 'ఏసీబీ రైడ్'లో చిక్కిన మున్సిపల్ కమిషనర్ 

--- నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామన్న ఏసీబీ డిఎస్పి కృష్ణ గౌడ్

 --హైదరాబాదు ఇంటిలో కూడా సోదాలు 

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం రోజు ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. మున్సిపాలిటీ కమిషనర్ ఆదిశేషులు 2023, సంవత్సరంలో 2, 3, 7, 10 వార్డులలో పెయింటింగ్ పనులు కాంట్రాక్టర్ చేయడంతో ఒక్కొక్క బిల్లు 83,930 రూపాయలు అలాంటి మూడు బిల్లులు ఉండడంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో 25000, రూపాయలు మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ 20 వేలకు ఒప్పుకొని 20000, రూపాయలు కమిషనర్ కు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి బి.కృష్ణ గౌడ్ వారి సిబ్బందితో పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులు హైదరాబాదులో ఇంటిని కూడా సోదాలు ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు..మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులను నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారి డిఎస్పి కృష్ణా గౌడ్ తెలిపారు.

Comments

-Advertisement-