రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Akshaya Tritiya: బంగారం కొనాలనుకుంటున్నారా? అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఇదే!

Akshaya Tritiya Akshaya Tritiya 2025 Gold buying Auspicious day Hindu festival Investment Wealth Prosperity Parashurama Lord Vishnu 916 gold purity
Peoples Motivation

Akshaya Tritiya: బంగారం కొనాలనుకుంటున్నారా? అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఇదే!

• ఏప్రిల్ 30న అక్షయ తృతీయ..

• హిందూ, జైన సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు..

• వైశాఖ శుక్ల పక్ష తదియ తిథినాడు ఈ పండుగ..

• బంగారం, ఆస్తుల కొనుగోలుకు శుభప్రదమని నమ్మకం..

• పౌరాణికంగా ఎంతో ప్రాముఖ్యత, దానధర్మాలకు విశేష ఫలం..

Akshaya Tritiya Akshaya Tritiya 2025 Gold buying Auspicious day Hindu festival Investment Wealth Prosperity Parashurama Lord Vishnu 916 gold purity

హిందువులు, జైనులు అత్యంత పవిత్రంగా భావించే పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. దీనిని అక్తి లేదా అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పర్వదినం ఏప్రిల్ 30వ తేదీ, బుధవారం నాడు రానుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసం శుక్ల పక్షంలోని మూడవ రోజైన (తదియ తిథి) ఈ దినాన్ని అత్యంత శుభప్రదమైన రోజులలో ఒకటిగా పరిగణిస్తారు.

అందుకే అక్షయ తృతీయ రోజున వివిధ జ్యువెల్లరీ కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. డిస్కౌంట్లు, మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు ధరలు తదితర ప్రయోజనాలను కొనుగోలుదారులకు అందిస్తుంటాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అక్షయ తృతీయ ప్రాముఖ్యతను తెలుసుకుందాం..

అక్షయ తృతీయ ప్రాముఖ్యత:

సంస్కృతంలో 'అక్షయ' అంటే 'శాశ్వతమైనది' లేదా 'క్షయం లేనిది' అని అర్థం. 'తృతీయ' అంటే మూడవ తిథి. ఈ రోజున ప్రారంభించిన ఏ పని అయినా, చేసిన పెట్టుబడి అయినా అనంతమైన శ్రేయస్సు, అదృష్టాన్ని తెచ్చిపెడతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ రోజు బంగారం కొనడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. బంగారాన్ని సంపదకు, భద్రతకు చిహ్నంగా భావించి కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజున బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే, కుటుంబానికి సంపద, సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం.

అక్షయ తృతీయకు పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అనేక ముఖ్యమైన సంఘటనలు ఈ రోజే జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగం ఈ రోజే ప్రారంభమైందని ఒక నమ్మకం. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా ఈ రోజేనని చెబుతారు. మహాభారత గ్రంథ రచయిత అయిన వేదవ్యాస మహర్షి, గణేశుడికి మహాభారతాన్ని చెప్పడం ప్రారంభించింది కూడా ఈ పవిత్ర దినాన అని ఒక కథనం.

శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడిని కలిసింది కూడా అక్షయ తృతీయ నాడేనని అంటారు. పవిత్ర గంగా నది స్వర్గం నుంచి భూమిపైకి దిగివచ్చింది కూడా ఇదే రోజని మరో విశ్వాసం ఉంది.

అక్షయ తృతీయ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పసుపు, కుంకుమలతో కలిపిన అక్షతలను స్వామికి సమర్పిస్తారు. విష్ణువు, గణపతి ఇతర దేవతలకు నైవేద్యాలు తయారు చేసి సమర్పిస్తారు. సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.

ఈ రోజును అత్యంత శుభప్రదంగా పరిగణించడం వల్ల, అనేక మంది బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాహాలు చేసుకోవడానికి కూడా ఈ రోజు అనుకూలమైనదిగా భావిస్తారు.

అంతేకాకుండా, దానధర్మాలు చేయడం అక్షయ తృతీయ ఆచారంలో ముఖ్యమైన భాగం. పేదలకు ధాన్యం, వస్త్రాలు, ఇతర నిత్యావసర వస్తువులను దానం చేయడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ విధంగా అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో, దానధర్మాలతో ఆచరించడం వల్ల శాశ్వత పుణ్యఫలం, సిరిసంపదలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం.

బంగారం గురించి ముఖ్యమైన సమాచారం: 

బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 క్యారెట్ గోల్డ్ ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కైన్స్ (గోల్డ్ కాయిన్స్), బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుందినగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుందా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. కొన్ని దుకాణాలు, కలప పన్నులు, సుంకాలు ముందుగా లోహాల ధరలను కలిగి ఉంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒక్కటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది. కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంటుందని చెబుతారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం నిర్వహణలకూ బాధ్యత వహించారు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.

Comments

-Advertisement-