రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

RGUKT ADMISSIONS 2025 ANDHRA PRADESH IIIT ADMISSIONS IIIT ADMISSIONS IN AP RGUKT AP ADMISSIONS RGUKT IIIT ADMISSIONS 2025 RGUKT IIIT ONLINE APPLICATIO
Peoples Motivation

ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

• ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు ప్రకటన జారీచేసిన ఆర్జీయూకేటీ..

• జూన్‌ 5వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

RGUKT ADMISSIONS 2025 ANDHRA PRADESH IIIT ADMISSIONS IIIT ADMISSIONS IN AP RGUKT AP ADMISSIONS RGUKT IIIT ADMISSIONS 2025 RGUKT IIIT ONLINE APPLICATIO

పదవ తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బిటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు. రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT) పరిధిలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ IIITల్లో ఆరేళ్ల సమీకృత బీటెక్‌ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. 2025-26 అకడమిక్ ఇయర్కి సంబంధించి వివరాలను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు క్యాంపస్‌ డైరెక్టర్, ప్రవేశాల కన్వీనర్‌ సండ్ర అమరేంద్రకుమార్‌ వెల్లడించారు. ఈ సారి 2 నెలల ముందుగానే అప్లికేషన్ల పక్రియను ప్రారంభించినట్లు చెప్పారు. RGUKT వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సెలక్ట్ అభ్యర్థుల జాబితాను జూన్‌ 5వ తేదీన విడుదల చేస్తామన్నారు. జూన్ 11వ తేదీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. జూన్‌ 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. పీహెచ్‌సీ, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సీట్ల వివరాలు: ఒక్కో క్యాంపస్‌లో 1000 సీట్లు, అదనంగా ఈడబ్ల్యూఎస్‌ సీట్లు మరో 100 ఉన్నాయి. మొత్తం 4 క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఫీజులు ఎంతంటే?: పీయూసీ (Pre-University Course)కి ఏడాదికి ట్యూషన్‌ ఫీజు రూ.45,000, ఇంజినీరింగ్‌కు ఏడాదికి రూ.50,000గా నిర్ణయించారు. తెలుగేతర రాష్ట్రాల వారికి 25% సూపర్‌ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అభ్యర్థులు సంవత్సరానికి ట్యూషన్‌ ఫీజు రూ.1.50 లక్షలు చెల్లించాలి. PUC తరువాత ట్రిపుల్‌ ఐటీ నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం ఉంది.

నిబంధనలు వర్తిస్తాయి: అప్లికేషన్లో అభ్యర్థి మెరిట్‌ కేటగిరీ వారిచ్చిన ప్రాధాన్యం ప్రకారం క్యాంపస్‌ కేటాయిస్తారు. ఒకసారి క్యాంపస్‌ కేటాయించిన తరువాత బదిలీలు ఉండవు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, ఎస్సీ సబ్‌ప్లాన్‌ వర్గీకరణ ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. గతంలో మాదిరిగా సీటు దొరుకుతుందో లేదో అనుకుని వేరే కాలేజీలలో చేరి మళ్లీ ఇక్కడ సీటు వస్తే అక్కడ డబ్బులు వదులుకుని ఇక్కడకు రావడం వంటి ఇబ్బందులు పడే ప్రసక్తే ఉండదు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఈ సారి ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని 17 జిల్లాలకు 65.62%, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 9 జిల్లాలకు 34.38% కేటాయించినట్లు అమరేంద్రకుమార్‌ చెప్పారు.

ముఖ్యమైన సమాచారం:

సెలక్టైన అభ్యర్థుల జాబితా విడుదల: జూన్‌ 5వ తేదీన

సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌: జూన్‌ 11వ తేదీ నుంచి

తరగతుల ప్రారంభం: జూన్‌ 30వ తేదీ నుంచి

దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్: www.rgukt.in లేదా AP ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా.

దరఖాస్తు రుసుము:

జనరల్ అభ్యర్థులు: ₹300

రిజర్వ్ చేయబడిన వర్గాలు: ₹200

ఇతర రాష్ట్రాల అభ్యర్థులు: ₹1000

రిజర్వేషన్ విధానాలను అనుసరించి, పదవ తరగతిలో మెరిట్ మరియు అర్హత పరీక్షలో ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.

Comments

-Advertisement-