వేసవి సెలవులకు వస్తూ... తిరిగిరాని లోకానికి తండ్రి కూతురు
Telangana tenth results 2025 link
www bse telangana gov in 2025
telangana ssc exam time table 2025 10th class
ts ssc result 2025 telangana
SSC results
By
Peoples Motivation
వేసవి సెలవులకు వస్తూ... తిరిగిరాని లోకానికి తండ్రి కూతురు
• మృత్యువడిలో తండ్రి కూతురు
• కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి విలువిలలాడుతున్న భార్యా ముగ్గురు పిల్లలు
• పిల్లలు పోషణ కొరకు.. దాతలు కోసం ఎదురుచూపు
రోడ్డు ప్రమాదంలో ఈనెల 23వ తారీఖున ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు దుర్మరణం చెందిన సంఘటన అనేకులను కలిసి వేసింది. విషయానికొస్తే... కర్నూలు జిల్లా ఆస్పరి మండలం, ముత్తుకూరు గ్రామానికి చెందిన వడ్డే ఈరన్న(45) ఇతనకు భార్య ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఇతనికి ఒక సెంటు భూమి కూడా లేనందున కూలి పనులకు వెళ్ళుతూ కుటుంబాన్ని పోషించేవాడు. తన కూతురు శ్రావణి (14) ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఆమెకు వేసవి సెలవులు రావడంతో తన తండ్రి తనను ఇంటికి తీసుకొని రావటానికి వెళ్లి, తండ్రి కూతురు తిరిగి వస్తుండగా పెద్ద హోతూరు గ్రామ సమీపంలో మృత్యువు లారీ రూపంలో వచ్చి తండ్రి, కూతురు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ తండ్రి, కూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆ కుటుంబ పెద్దదిక్కును, తన కూతుర్ని కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు లేనందువల్ల భార్య రాధమ్మ ముగ్గురు పిల్లలు కన్నీరు మున్నేరు అయిపోతున్నారు. తల్లి పిల్లల్ని ఓదార్చాలా.. పిల్లల తల్లిని ఓదార్చాలా.. తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం నెలకొంది. ఒకపక్క పేదరికంతో అల్లాడుతుంటే మరోపక్క పిల్లలు పరిస్థితి ఏమవుతుందో అని ఆ తల్లి కుమిలిపోతుంది. ఏ బంధువులు కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆమె బ్రతుకు మీద ఆశలు విడిచిపెట్టింది. నేను చస్తే నా పిల్లల అనాధలు అవుతారని తన ఊపిరిని బిగు పట్టుకొని జీవిస్తుంది. ఆ కుటుంబం పోషణ కొరకు ఎవరిని నోరు తెరిచి సహాయం అడగలేక, పిల్లల్ని పోషించుకోలేక, స్థితి మతం అవుతుంది. విషయాన్ని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జనసేన నాయకులు కురువ మహేష్ తనకున్న పరిచయాలతో ఆ కుటుంబానికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబంతో అతను మాట్లాడుతూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జి తెర్నేకల్ వెంకప్ప త్వరలో కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నాడని జనసేన పార్టీ తరఫునుండి మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. మరియు చిప్పగిరి కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయురాలులు, విద్యార్థినిలు తన తోటి విద్యార్థిని శ్రావణి కుటుంబానికి 22,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. గ్రామ పెద్ద ఆర్ఎంపీ డాక్టర్ హనుమంతు మాట్లాడుతూ ఆ కుటుంబని పోషించే పెద్దను, చేతి కందిన కూతురును కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కతోచన స్థితిలో ఉందని వారికి ఎకరా పొలం కూడా లేదని కూలి పనులకు వెళ్లి జీవనం సాగించే వారిని అలాంటి కుటుంబానికి ఆ దేవుడు ఇంత దారుణం వడి కట్టడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఈ కుటుంబానికి అండగా కులాలకు, మతాలకు, రాజకీయాలు అతిథంగా దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
Comments