రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

MAYONNAISE: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మయోనైజ్ పై ఏడాది పాటు నిషేధం

MAYONNAISE BAN IN TAMIL NADU MAYONNAISE BANNED IN TAMIL NADU MAYONNAISE TAMIL NADU TAMILNADU STOPS MAYONNAISE TAMIL NADU BANS MAYONNAISE BANS STATES
Peoples Motivation

MAYONNAISE: ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మయోనైజ్ పై ఏడాది పాటు నిషేధం

• ఉత్పత్తి, ప్యాకేజింగ్, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం..

• ఈ ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి నిర్ణయం..

MAYONNAISE BAN IN TAMIL NADU MAYONNAISE BANNED IN TAMIL NADU MAYONNAISE TAMIL NADU TAMILNADU STOPS MAYONNAISE TAMIL NADU BANS  MAYONNAISE BANS STATES

"మయోనైజ్ తయారీ, స్టోరేజీ సరిగ్గా లేక చాలా క్రిములు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. ఫలితంగా ప్రజల ఆరోగ్యానికి ఇది ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా సాల్మోనెల్లా టైపిమురియం, సాల్మోనెల్లా ఎంటరటైడిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద ఈ నిషేధం విధించామని -తమిళనాడు ప్రజారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం:

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ లవర్స్ ఇష్టపడే మయోనైజ్ ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మయోనైజ్ ఉత్పత్తి, ప్యాకేజింగ్, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఫుడ్ పాయిజన్ కావడంతో పాటు ఆరోగ్యానికి ప్రమాదమని ప్రజారోగ్య శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

పచ్చి పదార్థాలతో చేయడం వల్లే:

మయోనైజ్ను పచ్చి గుడ్డులోని తెల్ల సొనను, నూనె, వెనిగర్‌ లేదా నిమ్మరసంతో కలిపి బాగా కలియతప్పి తయారు చేస్తారు. దీనిని ఎక్కువగా షవర్మాతో పాటు మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా ఉపయోగిస్తారు. ఇందులో వాడేవన్నీ పచ్చి పదార్థాలు కావడంతో అందులో ప్రమాదకర సాల్మనెల్లా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. చాలా హోటళ్లలో అపరిశుభ్ర కోడి గుడ్లను పగులగొట్టి తయారీలో వాడుతున్నారు. అలాంటి మయోనైజ్‌ మరింత వేగంగా చెడిపోవడంతో పాటు రోజుల తరబడి దాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి తినడం వల్ల ఆనారోగ్యానికి గురవతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ఇప్పటికే బ్యాన్:

కాగా, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మయోనైజ్పై నిషేధం విధించింది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రజారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

-Advertisement-