రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలి 


మాదకద్రవ్యాల వలన యువత భవిష్యత్తు నాశనమవుతోందని జిల్లాలో వాటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. ‘నాషా ముక్త్ భారత్ అభియాన్’ కింద కలెక్టరేట్‌ గౌతమీ హాలులో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

మాదకద్రవ్యాలకు బానిసలై విముక్తి పొందిన వారు విద్యార్థులకు ప్రచారం చేయాలన్నారు.

జూన్ 1 నుండి 26 వరకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు, వాక్‌థాన్, క్రీడాపోటీలు నిర్వహించాలన్నారు.

ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఏర్పాటు చేయబడింది. ఫిర్యాదు గోప్యంగా ఉంచబడుతుంది.

టోల్ ఫ్రీ నెంబర్ పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కేంద్రాలలో ప్రదర్శించాలి.

మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా నార్కోటిక్ మందులు అమ్మకాలను నిరోధించాలి.

గంజాయి, డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలి; లఘు కేసులు కాకుండా కఠినంగా కేసులు నమోదు చేయాలి.

ప్రజల భాగస్వామ్యంతో మాదకద్రవ్య రహిత జిల్లా సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో eagle టీమ్ అధికారులు,రెవెన్యూ అధికారులు, ఆరోగ్య శాఖాధికారి, పోలీస్, న్యాయ సేవాధికార సంస్థ తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-