హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాడు
హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాడు
ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు
కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం
5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు
రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి... త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రివర్యులు నిర్మలా రామానాయుడు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలో పర్యటనలో భాగంగా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మలక వేమల హంద్రీనీవా ప్రధాన కాలువ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమీక్ష సమావేశంలో మంత్రివర్యులు మాట్లాడుతూహంద్రీనీవా ప్రాజెక్టులో ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫేజ్-1 కింద రూ.696 కోట్లతోనూ, ఫేజ్-2 కింద రూ.1,256 కోట్లతో HNSS ప్రధాన కాలువ (Km 216 – Km 400), పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 0.00 – Km 75) పనులు చేపట్టారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 75 – Km 207) పనులను రూ.480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు.ప్రాజెక్టు పూర్తయితే Phase-I కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు... మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. Phase-II కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగు నీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. పేర్కొన్నారు.హంద్రీనీవా పనుల్లో నాణ్యత విషయం లో రాజీపడకూడదు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్ ఇంజనీర్లు సీఈ నాగరాజు, ఈ స్వరూప్ కుమార్, మురళి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు ఇతర ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.