రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నీటి సమస్యను పరిష్కరిస్తాం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

నీటి సమస్యను పరిష్కరిస్తాం 


కడప జెడ్పీ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి

వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల ఉమ్మడి జెడ్పీ సర్వ సభ్య సమావేశం

నీటి సమస్యలు, బోర్ వెల్, పంటల నష్టం, గిట్టుబాటు ధరలు వంటి పలు అంశాలపై చర్చ

కడప జిల్లా, మే 15 :

గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తామని జెడ్పి చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి అన్నారు.

గురువారం ఉదయం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో.. జెడ్పి చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పి సర్వ సభ్య సమావేశం జరిగింది. 

ఈ సర్వసభ్య సమావేశానికి.. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి,ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పీ.రామసుబ్బా రెడ్డి,ఎమ్మెల్యేలు డా. సుధ, వరదరాజు రెడ్డి,అన్నమయ్య జిల్లా డిఆర్వో మధుసూదన్,జెడ్పి సీఈవో ఓబులమ్మ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

సమావేశం ప్రారంభంలో తొలుత ఉగ్రదాడి లో మరణించిన జవాన్ మురళి నాయక్,ఇటీవల మరణించిన మాజీ జెడ్పీ చైర్మన్ సీఎం బలరామిరెడ్డి లకు నివాళులు అర్పించాలని జడ్పీ చైర్మన్ కోరగా సభ్యులందరూ మౌనం పాటించి నివాళులు తెలిపారు.

జెడ్పీ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి మాట్లాడుతూ... జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మొదటిసారి అధ్యక్షత వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.

జిల్లా పరిషత్ నిధులను అన్ని నియోజకవర్గాల సభ్యులందరికీ సమానంగా ఇచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు.వైయస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని సభ్యులు లేవనెత్తిన సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు. ప్రధానంగా గ్రామాల్లో ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు.జిల్లా ప్రజాపరిషత్ అధికార యంత్రాంగం, ప్రజా పరిషత్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతామన్నారు. ఉమ్మడి జిల్లాల పరిషత్ పరిధిలో అన్ని రకాల అభివృద్ధి కార్యాచరణ జరుగుతోందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ....అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జిల్లాలో దాదాపు 2.10లక్షల మంది అర్హులైన రైతులను పరిశీలిస్తున్నామని తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలో రైతులు పైపుల కోసం చెల్లించిన నగదుకు సంబంధించి పాడా రద్దయిన నేపథ్యంలో ఏపీఎంఐపి ద్వారా రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.అలాగే జిల్లాలో ప్రకటించిన పది కరువు మండలాలలో రైతులను ఆదుకోవడానికి దెబ్బతిన్న పంటల కింద రూ 16 కోట్ల అంచనా తో ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలిపారు. జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడానికి లక్ష ఎకరాలను హార్టికల్చర్ కింద సాగు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇందులో దాదాపు 60 వేల ఎకరాల్లో ఉపాధి హామీ పథకం కింద బహు వార్షిక పద్ధతిలో పండ్ల తోటల పెంపకం,40 వేల ఎకరాల్లో వార్షిక పద్ధతిలో ఉద్యాన సహాయ అభివృద్ధి పథకం కింద పూలు, కూరగాయల సాగుకు సుముఖంగా ఉన్న రైతులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఏపీఎంఐపీ ద్వారా రైతులకు ఎన్ని ఎకరాల కైనా 70 నుంచి 90 శాతం సబ్సిడీతో సాగు చేయడానికి అవకాశం ఉందని వీటిపై ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో రైతులు పేర్లను నమోదు చేసుకుంటే వాటికి సంబంధించి ప్లాంట్ మెటీరియల్ అన్నిటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో మార్కెటింగ్ సంబంధించి ఇతర రాష్ట్రాల మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ రైతులు పంటను అమ్మేటప్పుడు మోసపోకుండా అవగాహన పెంచుతామన్నారు. అలాగే రైతులకు పట్టీలు కూడా అందజేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ కాలంలో వ్యవసాయానికి సంబంధించి నాలుగు ప్రాధాన్యత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా సీడ్ ఉత్పత్తి విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.సజ్జలు, కొర్రలు వంటి మిల్లెట్ పంటలను ఉత్పాదకతను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అన్నదాతలకు యాంత్రీకరణ పరికరాలు అందజేస్తామని తెలిపారు.ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయానికి వైపు రైతులు మొగ్గు చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో తాగునీటి కి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. గ్రామాల్లో బోర్ వేల్ వేసిన వెంటనే పవర్ కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలో మోడల్ స్కూల్ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామని పై విధంగా సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు విపులంగా వివరించారు.అలాగే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.జిల్లా అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు.  

అనంతరం అజెండా అంశాల వారీగా వ్యవసాయ శాఖా,హారికల్చర్, ఆర్డబ్ల్యూఎస్,పంచాయతీ రాజ్, విద్యాశాఖ, ఆర్ అండ్ బి, డ్వామా తదితర శాఖల అధికారులు ప్రగతి నివేదికను సమర్పించారు.

పలువురు ప్రజా ప్రతినిధులు, ఎంపిటిసిలు, జెడ్పిటిసీ సభ్యులు లేవనెత్తిన అనేక అంశాల పైన సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు

ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... పావలా వడ్డీ కింద రైతులు తీసుకున్న క్రాప్ లోన్లను ఇంతవరకు ఏపీజీబీ బ్యాంక్ అధికారులు జమ చేయలేదని వాటిని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెటింగ్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. మార్కెటింగ్ అధికారులు ఇతర జిల్లాలో మార్కెట్ రేట్లను గమనిస్తూ రైతులు నష్టపోకుండా మంచి ధరలు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.

ఎమ్మెల్సీ పి.రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులు పూర్తిగా నష్టపోయారని గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే నకిలీ విత్తనాలపై గట్టి చర్యలు చేపట్టి నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు విత్తనాలు సకాలంలో అందేలాగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు సోలార్ సంస్థ వారు రైతుల అనుమతి లేకుండా వారి భూముల్లో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని రైతులపై కేసులు పెడుతున్నారని వాస్తవాలను వెలికి తీసి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక, పశువుల మేత వంటి అవసరాల కోసం గ్రామాల్లో ఉన్న భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని కోరారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ... విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలని క్వాలిఫైడ్ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్నారని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి మంచి ఫలితాలు రాబట్టాలని కోరారు. జడ్పీ నిధుల్లో కొంత నియోజకవర్గాలకు కేటాయించాలని కోరారు.

బద్వేల్ ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలలో నీటి కొరతను తీర్చాలని కలెక్టర్ ను కోరారు.

వేముల జెడ్పీటీసీ మాట్లాడుతూ...చక్రాయ పేటలో సరైన సాగునీటి వసతులు లేవని మా మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చాలని కోరారు.గాలీ వాన బీభత్సం వలన చీనీ, మామిడి తోటల రైతులకు పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలి కోరారు.

భూములపై లోన్ తీసుకోవడానికి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వన్ బి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తే రైతులకు మరింత లోన్ ఎక్కువ లోన్ పొందే సౌకర్యం కలుగుతుందని అన్నారు. కొంతమంది రైతులు పాడా ద్వారా వ్యవసాయం పైపుల కోసం నగదు చెల్లించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి పరిష్కారం చూపాలని కోరారు.గండి క్షేత్రం లో నీటి కొరత ఎక్కువగా ఉందని ట్యాంకు నిర్మించాలని కోరగా జడ్పీ చైర్మన్ వెంటనే రూ 25 లక్షలు ఇస్తామని తెలుపగా కలెక్టర్ మిగతా నగదును తాము చెల్లిస్తామని తెలిపారు.

వేంపల్లి జెడ్పీటీసీ మాట్లాడుతూ...మా మండలంలో డికెటి భూములు ఉన్న రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాలని కోరారు. అలాగే అరటి రైతులు బాగా నష్టపోయారని గిట్టు వారు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని వాటిని ఎక్స్పోర్ట్ చేసేందుకు వీలు కల్పించాలని కోరారు. ప్యాక్ హౌస్ల నిర్మాణ రేటు పెంచాలని కోరారు. వేంపల్లిలో రైతు బజారు నిరుపయోగంగా ఉందని వినియోగం లోకి తీసుకురావాలని కోరారు.

వి.ఎన్ పల్లి జెడ్పీటీసీ మాట్లాడుతూ... దోసకాయ, కర్బుజా,మిరప రైతులకు గిట్టుబాటు ధరలు లేవని ,కూలి డబ్బులు కూడా రావడం లేదని వారికి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు. గాలి వానకు అరటి పంటలు వేల ఎకరాలలో నష్టం వాటిల్లిందని అరటి రైతులను ఆదుకోవాలని కోరారు.

సికే దీన్ని జడ్పీటీసీ మాట్లాడుతూ... జిల్లాలో గాలి వాన కారణంగా నష్టపోయిన పండ్ల తోటల రైతులను ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన అరటి రైతులకు హెక్టారుకు ఎంత పరిహారం ప్రభుత్వం అందజేస్తుందో తెలుపాలని కోరగా సమగ్ర ఉద్యాన మిషన్ స్కీం కింద తిరిగి పంట వేసుకోవడానికి హెక్టారుకు రూ 70 వేలు ప్రోత్సాహకంగా నమోదు చేసుకున్న అరటి రైతులకు ప్రభుత్వం అందించనుందని హార్టికల్చర్ అధికారిని తెలిపారు.

ఖాజీపేట మండల కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలో సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలపై చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే జిల్లా కడప కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు కనీస వసతులు లేవని మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పసుపు రైతుల కోసం మార్కెట్ యాడ్లో అదనపు గోడౌన్ నిర్మించాలని కోరారు. 

బి మఠం లో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా షాప్ లు ఏర్పాటు చేసుకొని నడుపుతున్నారని వాటిపై చర్యలు చేపట్టాలని సభ్యులు కోరారు. 

చెరువుల్లో అనధికారికంగా ఎక్కువ లోతు గుంతలు తీయడం వల్ల ఇటీవల దాదాపు 5 మంది పిల్లలు చనిపోయారని వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే కొన్ని చోట్ల జెడ్పీ భూములను ఆక్రమించుకున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఇంకా పలువురు జెడ్పిటీసిలు స్థానికంగా ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.

సమావేశంలో అజెండాలోని అంశాలను, సభ్యులు లేవనెత్తిన అంశాలను నమోదుచేసిన సమస్యలను పరిస్కరించే దిశగా కృషి చేస్తామని జడ్పీ చైర్మన్ తెలిపారు.

ఈ సమావేశానికి వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

Comments

-Advertisement-