భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం
అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రాకూడదు.. ఇళ్లలోనే ఉండాలి
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, మే 17 :
- భారీవర్షాల వేళ ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, సూచించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకలను ఎవరు దాటి ప్రయాణించరాదన్నారు. వర్షాల వేల ప్రమాదకర రహదారుల్లో కూడా వెళ్లరాదన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రాకూడన్నారు.
- భారీ వర్షాల వేళ జిల్లాలోని తడకలేరు, పండమేరు, పెన్నా, హగరి (వేదవతి), చిత్రావతి, కూతలేరు, ఉప్పు వంక, తదితర నదులు, వాగులు, వంకలు, పరివాహక ప్రాంతాల పరిధిలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో మొత్తం 146 ట్యాంకులు ఉండగా, అందులో 2,935 MCFT క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన నీరు నిలువ ఉంచే అవకాశం ఉందన్నారు. అందులో ఇప్పటికే 20 ట్యాంకులు 100 శాతం నీరు నిల్వ ఉండగా, మరో 20 ట్యాంకులు 75 శాతం నీటితో నిండి ఉన్నాయని, 43 ట్యాంకులు 50 శాతం నీటితో నిండి ఉన్నాయని, మరో 63 ట్యాంకుల్లో 25 శాతం నీరు నిల్వ ఉన్నాయన్నారు. మళ్లీ వర్షాలు వస్తే ఇప్పటికే పూర్తిగా నిండిన 20 ట్యాంకుల పరిధిలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు వస్తే ప్రజలు ఎవరూ బయటికి రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. జిల్లాలోని ఉరవకొండ మండలం బూదిగవి చెరువు మరువ పారుతోందని, శనివారానికి సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. భారీ వర్షాలు సమయంలో జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదని సూచించారు.