రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆరోగ్య సంరక్షణ కు యోగా యాప్ లో ప్రతి ఒక్కరూ నమోదు కండి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

 ఆరోగ్య సంరక్షణ కు యోగా యాప్ లో ప్రతి ఒక్కరూ నమోదు కండి


ప్రతి ఒక్కరినీ యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాలి

జిల్లా కలెక్టర్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ పై అవగాహన పెంచేందుకు మండల,గ్రామస్థాయి వరకు కార్యక్రమాలను చేపడు తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

యోగాంధ్ర-2025 కార్యక్రమాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 11 అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించు కొని(మే 21 నుండి జూన్ 21) వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విరివిగా యోగాంధ్ర యాప్ లో రిజిస్ట్రేషన్లు చేయించాలన్నారు. మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు ప్రతి ఒక్కరికి యోగ పై అవగాహన కలిగేలా ప్రతి ఒక్కరిని యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. జిల్లా స్థాయిలో యోగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నేటి నుంచి గ్రామస్థాయిలో యోగా పోటీలు ప్రారంభించాలన్నారు. రోజువారి కార్యక్రమాలను సంబంధిత వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలన్నారు.యోగాంధ్ర రిజిస్ట్రేషన్ ను https:// yogandhra.ap.gov.in/ #/home/launchone లో చేసుకోవాలన్నారు. అలాగే యోగాంధ్ర క్యూఆర్ కోడ్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. జి ఎస్ డబ్ల్యూ ఎస్ యాప్ నందు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పెద్దఎత్తున యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు సూచించారు.జిల్లాలో పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మాస్టర్ ట్రైనర్ ల శిక్షణ జరిగిందని, 3574 శిక్షకులు ఇప్పటి వరకూ నమోదు చేసుకుని శిక్షణ పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో 1,60,860 వేల మంది ప్రజలు నమోదు కావడం జరిగిందనన్నారు.. జూన్ 21 నాటికి ప్రతీ ఒక్కరు యోగ పై అవగాహన కలిగి,సాధన చేసే విధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. క్యూ ఆర్ కోడ్ వినియోగించి త్వరితగతిన నమోదు కావచ్చని అన్నారు. జిల్లాలో యోగా యాప్ లో పెద్ద ఎత్తున నమోదు చేసుకుని ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

Comments

-Advertisement-