రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

21న జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

InternationalYogaDay yogandhracampaign yogandhrapratibha Yogandhra AndhraPradesh yoga 11th national yoga National yoga day About yoga
Mounikadesk

 21న జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

  • 3 వేల మందితో జిల్లా స్థాయి కార్యక్రమం
  • యోగాంధ్ర కార్యక్రమానికి 10.38 లక్షల మంది రిజిస్ట్రేషన్.
  •  జిల్లా వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయ పరిధిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలి.

 -జిల్లా కలెక్టర్ షణ్మోహన్ 

ఈ నెల 21న జిల్లా అంతటా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్.. కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన తో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధత, తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాలు, మున్సిపాలిటీలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశంలో నిర్ణయించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధత, జిల్లాలో ఏర్పాట్లు, యోగా ట్రైనర్స్ కు, యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల పంపిణీ, ఫేజ్-3 యోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్.. అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి దిశా నిర్దేశనం చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవ దేశ ప్రధాని పాల్గొంటున్నారన్నారు


జిల్లాలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే జిల్లాస్థాయి కార్యక్రమం కాకినాడ పట్టణం నూకలమ్మ గుడి దగ్గర నుంచి మూడు లైట్లు జంక్షన్, దేవాదాయశాఖ కార్యాలయం వరకు 3 వేల మందితో నిర్వహించడం జరుగుతుందని అందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా 21న జిల్లా అంతటా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లావ్యాపంగా వార్డు/ గ్రామ సచివాలయాలు పరిధిలో గుర్తించిన వేదికలలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, సాధారణ ప్రజలను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

జిల్లాలో ఇంతవరకు యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి సుమారు10.38 లక్షల మంది పేర్లను నమోదు చేసుకున్నారన్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ట్రైనర్లుకు, పాల్గొన్నావారికి సర్టిఫికెట్ అఫ్ ఎక్సలెన్స్, పార్టిసిపేట్ సర్టిఫికెట్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలకు సంబంధించి మిగిలిన చివరి రెండు రోజులు సంబంధిత అధికారులు అందరు అప్రమత్తమత్తతో వ్యవహారించి విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు స్పష్టం చేశారు.

సమావేశంలో అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కర, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు, ఆయుష్ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-