తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. నూతన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. నూతన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది.. ఈ ఉత్సవాలకు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులు హాజరుకానున్నారు.ఈ సందర్భంగా, మిషన్ 26 డేస్ పేరుతో అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా, రాజీవ్ యువ వికాసం పథకం కింద నాలుగు నెలల్లో 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చనున్నారు.
గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించడంతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం కూడా జరగనుంది. పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధుల చెల్లింపునకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు యువత సాధికారత, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం స్కీంకు రూపకల్పన చేశారు. దశల వారీగా అమలు చేయనున్న ఈ పథకంలో మొదట లక్షలోపు వారికి సబ్సిడీ అందజేయనున్నారు. అలాగే ప్రతినెలా 1500 కోట్ల చొప్పున 6 వేల కోట్ల సబ్సిడీని అక్టోబర్ 2 నాటికి లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జూన్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నారు. రేవంత్ సర్కార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకలు తెలంగాణ ప్రగతికి, సంక్షేమానికి కొత్త దిశానిర్దేశం చేయనున్నాయి.