సఖీ కేంద్రంలో ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
సఖీ కేంద్రంలో ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశం
అనంతపురం, జూన్ 19 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు ఆములు చేస్తుందని వీటి పై మహిళలకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురంలోని ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఖీ కేంద్రం(వన్ స్టాప్ సెంటర్)ను జిల్లా మహిళ శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణి, జీజీహెచ్ ఆర్. ఎం . ఓ ఓ.డాక్టర్ హేమలత, అర్బన్ తహశీల్దార్ హరితో కలసి సఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు ఆములు చేస్తుందని వీటి పై మహిళలకు పూర్తి అవగాహన కల్పించాలని పి డి ని ఆదేశించారు.వన్ స్టాప్ సెంటర్ (సఖీ కేంద్రం) లో ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,చట్ట ప్రకారంగా సఖీ కేంద్రం లో ఉన్న సిబ్బంది పనిచేయలని ఆదేశించారు. సఖీ కేంద్రంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, సఖీ కేంద్రానికి ఎలాంటి సమస్యల తో వచ్చే మహిళలకు సఖీ కేంద్రం ద్వారా ఎలాంటి సేవలు అందింస్తున్నారని, సమస్యలతో సఖీ కేంద్రానికి వచ్చిన వారి పూర్తి వివరాలు, వారికి ఎలాంటి సలహాలు అందజేస్తున్నారు, సఖీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సేవలకు సంబంధించి నమోదు చేసిన రిజిస్ట్రార్లు ను పరిశీలించారు. చెక్ లిస్ట్,ఫైల్స్ మెయింటైన్స్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
24 / 7 గంటలు సఖీ కేంద్రం లో సేవలు అందుబాటులో ఉంటాయని,సఖీ కేంద్రానికి సమస్యలతో వచ్చే మహిళలకు
కౌన్సిలింగ్,వైద్యసేవలు, న్యాయ సలహాలు,పొలీస్ సహాయం, తాత్కాలిక వసతి,ఆపద నుండి ఆదుకోవడం,రక్షణ కల్పించడం వంటి అంశాలపై సమస్యలతో వచ్చిన మహిళలకు సేవలు అందించడం జరుగుతుందని,2006 నుండి జిల్లా లో గృహ హింస చట్టం క్రింద 1914 కేసులు నమోదు చేయడం జరిగిందని, అందులో 1290 కేసులు పరిష్కరం చేయడం జరిగిందని, 592 కేసులు కోర్టు విచారణలో ఉన్నాయని,32 కేసులు రక్షణ అధికారి విచారణలో ఉన్నాయని సఖి కేంద్ర మేనేజర్ శాంతామణి కలెక్టర్ కు వివరించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్.ఎం.ఓ ఓ పద్మజ, డీసీపీఓ మంజునాథ్, మహిళా ఎస్సై భారతి పాల్గొన్నారు.