రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు

  • కర్నూలు జిల్లాలో వివిధ శాఖల ద్వారా 2 294 పనులు చేపట్టేందుకు రూ. 2014 కోట్లు మంజూరు
  • రూ.80 వేల కోట్లతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం
  • పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం
  • జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

కర్నూలు, జూన్ 11 (పీపుల్స్ మోటివేషన్):- అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

బుధవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో రూ.678.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, రూ. 141 లక్షల రూపాయల వ్యయంతో కర్నూలు - అనుగొండ రోడ్డు నుండి దొడ్డిపాడు వరకు నిర్మించిన తారురోడ్డు, రూ. 2250.00 లక్షలు అంచనా వ్యయంతో రెండు వరసల రహదారిగా వెడల్పు చేసి నిర్మించిన నన్నూరు - చిన్నటేకూరు - కె.నాగలాపురం - గూడూరు - సి. బెలగళ్ - ఎమ్మిగనూరు రోడ్ ప్రారంభం, రూ.40 లక్షల రూపాయల వ్యయంతో ఎన్ హెచ్ 40 నుండి నన్నూరు ఎస్సీ కాలనీ చర్చి వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పునర్నిర్మాణం పనులకు జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత , జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా యావత్తు భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా తడకనపల్లి గ్రామం నిలిచిందన్నారు. అని అటువంటి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

జిల్లాలో అభివృద్ధిలో భాగంగా ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్,

ఆర్ డబ్ల్యూ ఎస్ తదితర శాఖల ద్వారా 10 నెలల కాలంలోనే 2 294 పనులు చేపట్టేందుకు రూ. 2014 కోట్లు మంజూరు చేశామన్నారు.. ఇందులో కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు..

పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా 9 వేల 718 ఎకరాలు సేకరించి ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ ను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. M/S జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీ 413.19 ఎకరాల్లో రూ.2938 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.. అలాగే 300 ఎకరాలలో డ్రోన్ కార్పొరేషన్, 1002.36 ఎకరాలలో పీపుల్ టెక్ కంపెనీ ద్వారా సెమీ కండక్టర్, బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రూ.320 కోట్లతో జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ పరిశ్రమ ఏర్పాటు అవుతోందన్నారు.. రూ. 11 కోట్లతో టమాటో ప్రాసెసింగ్ యూనిట్ 77 ఎకరాల్లో ఎమ్మిగనూరు లో మెగా టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముచ్చుమర్రి నుండి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు రూ.428 కోట్ల రూపాయలతో నీటి సరఫరా కోసం పైప్ లైన్ పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు.. గ్రీన్ కో కంపెనీ ద్వారా 1680 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుందన్నారు. 10 నెలల కాలంలోనే 7 వేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యం కాగా, ప 5 వేల 653 హెక్టార్లలో డ్రిప్ ఏర్పాటు చేయడం జరిగింద న్నారు.

హంద్రీ నీవా ప్రాజెక్టు కు బడ్జెట్ లో రూ.3 800 కోట్లు రూపాయలు కేటాయింపు చేశామంటే, రాయలసీమకు అందులోనూ కర్నూలు జిల్లాకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఇందుకు నిదర్శనం అన్నారు...

రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా ఒక జీవనాడి లాంటిదన్నారు.. అటువంటి హంద్రీనీవాకు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు.. మోటర్లకు సంబంధించినటువంటి కరెంట్ బిల్లులు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు.. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మల్యాల దగ్గర నుండి చిట్ట చివరి ప్రాంతం వరకు కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయన్నారు.. 

అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతున్నామన్నారు.. ఆస్తి హక్కు కల్పించి మహిళల అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక సాధికారతకు నాంది పలికారన్నారు..మహిళల కోసం గతంలో దీపం పథకం గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాలని, ఇపుడు దీపం 2 పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందిస్తున్నారన్నారు...విద్య, ఉద్యోగ విషయాల్లో కూడా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు.. 

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి నెల మొదటి తేదీన వివిధ రకాలైన పెన్షన్ లను రూ.4 వేలు, రూ.6 వేలు, రూ. 10 వేలు, రూ.15 వేల పెన్షన్ లను లబ్ధిదారుల గడప వద్దకే వెళ్ళి అందజేయడం జరుగుతోందన్నారు

అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు.. డీఎస్సీ ద్వారా 16 వేల పోస్టులను భర్తీ చేస్తుంటే అందులో 30 శాతం పోస్ట్లు కర్నూలు జిల్లాలోనే భర్తీ అవుతున్నాయన్నారు.. గుంతలు లేని రోడ్ల నిర్మాణాలు, అమరావతి రాజధాని నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, 80 వేల కోట్ల రూపాయలతో పోలవరం బనకచర్ల నిర్మాణం చేయడం జరుగుతోందని, పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మంత్రి తెలిపారు. 

తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు చొప్పున ఈ జూన్ నెలలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి మీ అకౌంట్ ఖాతాలో జమ చేయనున్నామన్నారు.. అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయలు రైతు సాయం కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తామన్నారు.

పాణ్యం శాసనసభ్యులు, సర్పంచ్ చెప్పిన సమస్యలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ.. దేశంలో 13 కేంద్రాలు గుర్తిస్తే అందులో ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రం ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు.. రానున్న రోజులలో ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు... గత ప్రభుత్వంలో అభివృధి పనులు ఏమి జరగలేదని, మన ప్రభుత్వం రాగానే అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నాయన్నారు.

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ..

 జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా దాదాపు 2 వేల కోట్ల పనులను మంజూరు చేయగా అందులో దాదాపు 1600 కోట్లు పాణ్యం నియోజకవర్గంలోని ఈ రెండు మండలాల్లో ఉన్నాయన్నారు..

ఓర్వకల్లు లో ఇండస్ట్రియల్ హబ్ లో 10 వేల ఎకరాల్లో ఒక 5 వేల ఎకరాలు కేంద్ర నిధుల కింద మరియు రాష్ట్ర ప్రభుత్వం కన్వెర్జెన్స్ తో ఒక పారిశ్రామిక నోడ్ ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారన్నారు. ఇందుకు సంబంధించి 1100 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా వేయడం జరిగిందన్నారు..ఇక్కడే ఎమ్ ఎస్ ఎం ఈ పార్కును ముఖ్యమంత్రి గత నెలలో వర్చువల్ గా ప్రారంభించారన్నారు.. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సిద్ధమైందన్నారు.. అదే విధంగా 300 ఎకరాల్లో డ్రోన్ హబ్, దేశంలోనే పెద్ద ప్రాజెక్టుగా గ్రీన్ కో ప్రాజెక్ట్, అదే విధంగా జై రాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చిందన్నారు..

పత్తికొండలో 11 కోట్లతో ఏర్పాటు చేస్తున్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్ పనులు 4 నెలల్లో పూర్తవుతాయన్నారు.. ఎమ్మిగనూరులో 77 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో విండ్, సోలార్ ఎనర్జీకి సంబంధించి దాదాపు 1680 మెగా వాట్ లతో ప్రాజెక్టులు మంజూరు అయ్యాయన్నారు. రూ. 80 కోట్లతో సిసి రోడ్లు వేశామని, సీసీ రోడ్లను 100 శాతం పూర్తి చేయడంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు.. రైతులకు సంబంధించి ఈ సంవత్సరం 8 వేల 500 ఫామ్ ఫండ్ లు శాంక్షన్ చేశామని, అందులో 2 వేల 600 పూర్తి అయ్యాయన్నారు.. ఆర్ & బి రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చడానికి దాదాపు 20 కోట్లు ఖర్చు చేశారన్నారు. 8 కోట్ల రూపాయలతో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు అన్నిటిని మరమ్మతులు చేయించామన్నారు.. అలాగే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ మరమతులకు కూడా ఎంపీ నిధుల కింద కోటిన్నర రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు..ఇంటి పట్టా లేని వారు హౌసింగ్ కొరకు దరఖాస్తు వెంటనే చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు...పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయిన వారికి వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఇందుకు సంబంధించిన పెన్షన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిందన్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా 93 శాతం స్ట్రైక్ రేటుతో 175 సీట్ల గాను 164 సీట్లను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుందన్నారు.. అందుకే ప్రజలు మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ముందు చూపుతో, ఆలోచనతో, కఠోర శ్రమతో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలోముందుకు తీసుకెళ్తా ఉన్నారన్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి వైపు రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు.. గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చి వేయడం జరిగిందన్నారు.. పాణ్యం నియోజకవర్గం లో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు వేయించడం జరిగిందన్నారు.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.. 204 అన్న క్యాంటీన్లు రన్ అవుతున్నాయన్నారు....ఇచ్చిన హామీ ప్రకారం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 వేల పెన్షన్ 4 వేల రూపాయలు చేశామని, అదే విధంగా 3 నెలల అరియర్స్ కలిపి మొత్తం 7 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం దే అన్నారు..

దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నారన్నారు... తల్లికి వందనం కార్యక్రమం కింద జూన్ 14వ తేదీ నుండి ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంత మంది పిల్లలకి సంవత్సరానికి 15000 తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుందన్నారు.. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు..అలాగే అన్నదాత సుఖీభవ పథకం కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొని రానుందన్నారు.. 

పాణ్యం నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు..ఆర్ అండ్ బి కింద 84 కోట్ల రూపాయల విలువగల పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు.. ఎన్ఆర్ఈజీఎస్ కింద సిసి రోడ్లనిర్మాణం, గోకులం షెడ్లకు 18 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.నియోజకవర్గంలోని హాస్టల్స్ ఎస్సీ, బీసీ హాస్టల్ లకు 3 కోట్లతో మరమ్మతులు పూర్తయ్యాయన్నారు.m కేజీబీవీ స్కూల్స్ నిర్మాణం కోసం ఐదున్నర కోట్లు శాంక్షన్ చేయించి మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు..ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు పర్యటన కి వచ్చినప్పుడు మౌలిక సదుపాయాల కోసం 50 కోట్లు కేటాయించారన్నారు..

ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కోసం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము మొదటి బడ్జెట్ లోనే 2 వేల 800 కోట్లు శాంక్షన్ చేసిందని, కొన్ని పనులకు టెండర్లు కూడా పిలిచారన్నారు.. ఓర్వకలు ఇండస్ట్రియల్ హబ్ ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉందన్నారు. గడివేముల బైపాస్ రోడ్డు కూడా మంజూరు అయిందని, నియోజక వర్గానికి కావలసిన పనులను మంత్రి దృష్టికి తెచ్చారు.

టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పరుగులు తీస్తుందన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు తేడా లేకుండా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను ప్రారంభించుకుంటున్నామన్నారు.

అనంతరం నూతనంగా శాంక్షన్ చేసిన వితంతువు పెన్షన్ ఆర్డర్ లను ఇంచార్జి మంత్రి మహిళలకు అందచేశారు.. అనంతరం స్వయం సహాయక సంఘాలకి సంబంధించి బ్యాంక్ లింకేజ్ ద్వారా 19 స్వయం సహాయక సంఘాలు 186 మంది సభ్యులకు 2 కోట్ల 46 లక్షల రూపాయల మెగా చెక్ ను ఇంచార్జ్ మంత్రి, కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే, కలెక్టర్ అందజేశారు.

కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్డిఏ పిడి రమణ రెడ్డి, సర్పంచ్ షేక్ బీబీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

-Advertisement-