కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి..
కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి..
జనార్ధనావరంలో నాగలితో పొలందున్ని ఏరువాక పౌర్ణిమ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి..
జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు...
జిల్లాలో రూ.3.2 కోట్ల విలువైన డ్రోన్లు అందజేశాం..
ఏలూరు/నూజివీడు/చాట్రాయి,జూన్,11: వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో జిల్లాలో రూ. 3.05 కోట్లతో 875 మంది రైతులకు వ్యవసాయ అధునిక పరికరాలు అందించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. బుధవారం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో నాగలితో పొలం దున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్ధసారధి ప్రారంభించారు. ఈ సందర్బంగా పుడమి తల్లిని పూజించి వ్యవసాయ పనులు ప్రారంభించే ఈ శుభదినం ఏడాది పొడవునా అన్నదాతలకు సిరులు పండేలా చేయాలని ఆకాంక్షిస్తూ రైతన్నలందరికీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాగులో యాంత్రీకరణ ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతులకు అవసరమైన యంత్రపరికరాలు, డ్రోన్లు అందించడం జరుగుతున్నదన్నారు. ఏలూరు జిల్లాలో ఇంతవరకు 40మంది రైతు గ్రూపులకు సంబంధించి రూ. 3.2 కోట్ల విలువైన డ్రోన్ల ను అందించగా నూజివీడు నియోజకవర్గంలో 4గురు రైతు గ్రూపులకు రూ. 32 లక్షల విలువైన డ్రోన్ల ను అందించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా నూజివీడు నియోజక వర్గంలో సుమారు 150 మంది రైతులకు సుమారు రూ. 70 లక్షలు విలువైన ఆధునిక యంత్రపరికరాలు అందించామన్నారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేయడంలో భాగంగా ఈనెల 20 వతేదీన రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్ధితులు అనుకూలించనప్పటికీ రైతులకు మేలుచేసే కార్యక్రమంలో మాత్రం ఎటువంటి రాజీపడేది లేదన్నారు. గత ప్రభుత్వం రైతు సంక్షేమం పై మాటలకే పరిమితమైన దని, చేతల్లో శున్యం అన్నారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టిన రూ. 1640 కోట్ల ను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఖరీప్, రబీ సీజన్ లో ధాన్యం పండించిన రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ధాన్యం అందించిన రైతులకు 24 గంటల లోపులోనే సొమ్ము వారి ఖాతాలకు జమచేయడం జరిగిందన్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధరంగాలైన ఉధ్యానవనం, ఆక్వారైతులను కూడా ఆధుకునే క్రమంలో స్ప్రేంకర్లు, డ్రిప్ ఇరిగేషన్ పధకాలను 50 నుండి 90 శాతం సబ్సిడీతో అందిస్తున్నామన్నారు. జిల్లాలో కో కో రైతల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.