రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జలరవాణా-టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

జలరవాణా-టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

• టూరిజం, ఇన్ లాండ్ వాటర్ వేస్ ల సంయుక్త ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు

• రోడ్డు, రైల్ రవాణా ఛార్జీలతో పోల్చితే జల రవాణాకు ఖర్చు తక్కువ 

• రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు జల రవాణాలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

• ఏపీఐడబ్ల్యూఏ 2వ వార్షికోత్సవం సందర్భంగా బోట్ మారథాన్ 

• జల రవాణా రంగంలో పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తాము.

- బి.సి. జనార్థన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖామాత్యులు.

రాష్ట్రంలో జలరవాణా ద్వారా అధిక పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, జల రవాణా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖామాత్యులు బి.సి. జనార్థన్ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ (APIWA) ద్వితీయ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని సోమవారం పున్నమి ఘాట్ నుండి"బోట్ మారథాన్" కార్యక్రమంను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ ఇన్ లాండ్ వాటర్ వేస్, టూరిజం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. దీంతో అటు ప్రభుత్వానికి ఆదాయం కలగడంతో పాటు ఇటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. సాంప్రదాయ రవాణా మార్గాలైన రోడ్ మరియు రైల్ సరుకు రవాణా విధానాలతో పొల్చితే ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ తక్కువ ఖర్చుతో కూడిన విధానమన్నారు. రోడ్డు రవాణాతో పోల్చితే జల రవాణా ద్వారా దాదాపు 50 శాతం తక్కువ ఖర్చుతో సరుకును గమ్యస్థానానికి చేర్చవచ్చన్నారు. అదీ కాకుండ రహదారి మరియు రైల్ మార్గాలపై వాహనాల ట్రాఫిక్ ను కూడా తగ్గించవచ్చు అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. 

దేశంలోనే రెండో అతి పెద్ద తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో మొత్తం 1,555 కిలోమీటర్ల పరిధిలో నావిగేషన్ కు అనుకూలమైన జల మార్గాలు ఉన్నాయని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. వీటిలో 900 కిలోమీటర్ల వరకు జాతీయ జల మార్గాలు ఉండటం విశేషమన్నారు. ఈ జల మార్గాల ద్వారా పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. అంతేకాకుండ పర్యాటకానికి ఊతమిస్తుందన్నారు. పీపీపీ మోడల్ లో ఆయా ప్రాజెక్ట్ లను అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇన్ లాండ్ క్యూయిజ్ టూరిజంను ప్రోత్సహించడం మా వ్యూహమన్నారు. ఇందులో భాగంగా రీజనల్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే రూ. 201.50 కోట్ల నిధుల సహాయం కోసం కేంద్రంకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ నిధులతో ఆర్ఓ-ఆర్ఓ టెర్మినల్స్, వాహనాల కు రూ. 153 కోట్లు, క్రూయిజ్ నౌకలు, డ్రెడ్జర్లు, డాక్ ఫెసిలిటీలకు, జల ఆధారిత టూరిజం మౌలిక వసతుల కల్పన చేపట్టనున్నామని మంత్రి తెలిపారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జల రవాణా మార్గాలను మూడింతలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు. రాష్ట్రంలోని జల రవాణా మార్గాలు.. జల రవాణాకు ఉన్న అపారమైన అవకాశాలపై ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించి అనంతరం అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు. కృష్ణా , గోదావరి సహా నదులు, కాలువల్లో జలరవాణా చేపడతామని, జల రవాణా ద్వారా ప్రయాణికులను తక్కువ చార్జీతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని, జలరవాణా ద్వారా పలు మార్గాల్లో బొగ్గు, సిమెంట్ , రవాణా ను చేపట్టనున్నామని తెలిపారు. మరీ ముఖ్యంగా జల రవాణా మార్గాలు పర్యావరణానికి అత్యంత అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్. శివప్రసాద్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ సీఈ రాఘవరావు తదితరులు పొల్గొన్నారు.

Comments

-Advertisement-