రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

యోగాతో ఇంటిల్లిపాదికీ యోగానందం..!!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

యోగాతో ఇంటిల్లిపాదికీ యోగానందం..!!

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

యోగాంధ్ర మసోత్సవాల్లో భాగంగా.. కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో యోగాసనాలు

ఫ్యామిలీ యోగా" లో పాల్గొన్న 4,365 మంది కుటుంబ సభ్యులు

కడప, (పీపుల్స్ మోటివేషన్):-

మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే.. ఇంటిల్లిపాదికీ యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతం అవుతుందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.

యోగాంధ్ర మసోత్సవాల్లో భాగంగా... ఆదివారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫ్యామిలీ యోగా" కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.  

ఈ కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4,365 మందికి మాస్టర్ ట్రైనర్లు యోగాసనాలపై అవగాహన, శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి హాజరై యోగాసనాలు వేసి జిల్లా ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమానికి ఒక్కో కుటుంబానికి చెందిన పిల్లలు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ మొదలైన మూడు కెరగిరీలకు చెందిన 4,365 మంది హాజరై యోగాసనాలు వేయడం.. గర్వించదగ్గ విషయం అన్నారు. 

యోగా సాధనతో మానసిక సమస్యలకు, శారీరక రుగ్మతల నుండి విముక్తి లభిస్తుందన్నారు. మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాసనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. యోగా ఆసనాలు వేయడం ద్వారా.. క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని కోరారు. కడప నగరంలో "ఫ్యామిలీ యోగా" కాన్సెప్ట్ తో నిర్వహించిన కార్యక్రమం నగర ప్రజల్లో నూతనోత్సాహం నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, అవ్వతాతలు మొదలైన మూడు కేటగిరీలకు చెందిన కుటుంబ సభ్యులు కలిసి పాల్గొనడం ఆనందదాయకమైన విషయం అన్నారు. 

కాగా "యోగాంధ్ర క్యాంపెన్ -2025" మాసోత్సవాలు మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఈ ఆదివారం "ఫ్యామిలీ యోగా" కాన్సెప్ట్ తో జిల్లాలోని అన్ని కుటుంబాలకు యోగాపై అవగాహన, యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విశదీకరిస్తూ.. అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. 

అలాగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమంలో జూన్ 21న విశాఖలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ ను నెల రోజులపాటు "యోగా మంత్" గా నిర్వహించడం జరుగుతోందన్నారు. అనంతరం యోగా ట్రైనర్లు కార్యక్రమానికి హాజరైన వారితో.. ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు వేయించారు.

ఈ కార్యక్రమంలో కడప మునిసిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి, కడప ఆర్‌డిఓ జాన్ ఇర్విన్, జిల్లా పర్యాటక అధికారి సురేష్ కుమార్, స్టెప్ సీఈఓ సాయి గ్రేస్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగస్వామి, డిఎమ్ హెచ్‌ఓ డా.నాగరాజు, డిఎస్‌డిఒ జగన్నాథ రెడ్డి, ఆయుష్ నోడల్ అధికారి డా. మురళి తదితర జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, పలువురు ఉద్యోగులు, ఎన్జీవో ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-