ప్రజల నుంచి యోగాంధ్ర కు అనూహ్య స్పందన
ప్రజల నుంచి యోగాంధ్ర కు అనూహ్య స్పందన
నెల రోజులపాటు జరిగే యోగాంధ్ర -2025 కార్యక్రమాల్లో 13 వ రోజు (02.06.2025) నిర్వహించిన యోగా కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రజల నుంచి విశేషంగా స్పందన లభించింది. మే 21, 2025 నుంచి ప్రారంభమైన యోగా కార్యక్రమాలు దిగ్విజయంగా 13 వ రోజుకు చేరాయి..
13వ రోజు ముఖ్యాంశాలు:
1. పౌరుల రిజిస్ట్రేషన్లు:
● పౌరుల రిజిస్ట్రేషన్లు 1,71,92,754 కు చేరుకున్నాయి (153% ప్రగతి),
ఈ రోజే : 5,95,452 కొత్త రిజిస్ట్రేషన్లు జరిగాయి.
2. శిక్షకుల సమీకరణ:
● ఇప్పటి వరకు1,48,742మంది శిక్షకులు నమోదయ్యారు (118% ప్రగతి), అందులో 10,609 మంది మాస్టర్ ట్రైనర్లు నమోదు చేసుకున్నారు (408% ప్రగతి)
3. శిక్షణా కార్యక్రమాల వివరాలు:
● మాస్టర్ ట్రైనర్స్ శిక్షణలో 5,353 మంది వ్యక్తులు శిక్షణ పొందారు (206% ప్రగతి)
● 1,42,412 (113% ప్రగతి) మంది మండల ట్రైనర్లకు శిక్షణలో పాల్గోనడం జరిగింది.
జూన్ 3, 2025 నుండి పౌర శిక్షణా సెషన్లు ప్రారంభం కానున్నాయి.
కమ్యూనిటీ పోటీలు:
● గ్రామ స్థాయి పోటీలు చురుకుగా నిర్వహించబడుతున్నాయి, ఇప్పటి వరకు 14092 పోటీలు పూర్తయ్యాయి (93.95%)
● మండల, జిల్లా మరియు రాష్ట్రస్థాయిల్లో పోటీలు వరుసగా జూన్ 2, జూన్ 9 మరియు జూన్ 16 తేదీల్లో ప్రారంభంకానున్నాయి.
● అలాగే ఈ క్రింది తెలియజేసిన ప్రఖ్యాత పర్యాటక కేంద్రాల నందు యోగా కార్యక్రమము నిర్వహించడం జరిగింది.
ASR Park, గోలుగొండ మండలం అనకాపల్లి,-1028 మంది పాల్గొన్నారు గుత్తికోట, గుత్తి, అనంతపురం-1050 మంది పాల్గొన్నారు
పులిగుండు ప్రాంగణం దగ్గర, పులిగుండు, చిత్తూరు– 2323 మంది పాల్గొన్నారు
● ఈ రోజు నిర్వహించిన థీమాటిక్ యోగా ఆటో మరియు లారీ అసోసియేషన్ కృష్ణా జిల్లా 6700 మందితో నిర్వహించడం జరిగింది.
ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాల్లో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, ఏపీ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్సీ ఆర్. గంగాధరరావు, అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, డీఎమ్ అండ్ హెచ్వో డాక్టర్ రవి కుమార్, అనంతపురం కలెక్టర్ డాక్టర్. వి. వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, డీఎమ్ అండ్ హెచ్వో డాక్టర్ ఈబీ దేవి, చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ వీఎన్ మణికంఠ చందోలు లు పాల్గొన్నారు.